తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'గంటలు కాదు.. మోదీని 72ఏళ్లు నిషేధించాలి'

ప్రధాని నరేంద్రమోదీ ప్రచారంపై 72 ఏళ్లు నిషేధం విధించాలని ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్​ డిమాండ్​ చేశారు. బంగాల్​ బహిరంగ సభలో 40 మంది తృణమూల్​ ఎమ్మెల్యేలు తనకు టచ్​లో ఉన్నారన్న మోదీ వ్యాఖ్యలను తప్పుబట్టారు అఖిలేశ్.

By

Published : Apr 30, 2019, 11:02 AM IST

Updated : Apr 30, 2019, 12:53 PM IST

అఖిలేశ్ యాదవ్​

మోదీపై అఖిలేశ్ వ్యంగ్యాస్త్రం

బంగాల్​లో ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగంపై మండిపడ్డారు ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్​. ప్రధాని హోదాలో ఉండి 40 మంది తృణమూల్​ ఎమ్మెల్యేలు తనతో టచ్​లో ఉన్నారనటం సమంజసం కాదన్నారు. ఇలాంటి వారు ప్రచారం చేయకుండా 72 ఏళ్లపాటు ఈసీ నిషేధం విధించాలని డిమాండ్ చేశారు.

"అభివృద్ధి అడుగుతోంది... మీరు ప్రధాని అవమానకరమైన ప్రసంగం విన్నారా? 125 కోట్ల మంది దేశ ప్రజల నమ్మకం కోల్పోయాక.. అనైతిక వాగ్దానాలు, 40 మంది ఎమ్మెల్యేలు ఫిరాయిస్తారని మాట్లాడుతున్నారు.

ఈ వ్యాఖ్యల్లో మోదీ నల్లధనం మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఆయనపై 72 గంటలు కాదు.. 72 ఏళ్లు నిషేధం విధించాలి."

-అఖిలేశ్ యాదవ్​, ఎస్పీ అధినేత

ప్రచారంలో ఎన్నికల నియమావళిని ఉల్లఘించిన చాలా మంది నేతలపై ఇటీవల ఈసీ 72 గంటల పాటు నిషేధం విధించింది. ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, పంజాబ్​ మంత్రి నవ్​జోత్​ సింగ్​ సిద్ధూ ఉన్నారు.

మోదీ ప్రకటనను తృణమూల్​ నేతలు తిప్పికొట్టారు. ప్రచారంలో ఇలాంటి వ్యాఖ్యలపై చేయటంపై ఈసీ ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

ఇదీ చూడండి:'దీదీ.. మీ 40 మంది ఎమ్మెల్యేలు నావైపే'

Last Updated : Apr 30, 2019, 12:53 PM IST

ABOUT THE AUTHOR

...view details