తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా: వుహాన్​ నుంచి దిల్లీకి చేరుకున్న భారత పౌరులు - Coronavirus

324 మంది భారతీయులతో వుహాన్ నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం దిల్లీకి చేరుకుంది. చైనాలో అంతకంతకూ కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో అక్కడున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చింది ప్రభుత్వం.

Air India special flight carrying 324 Indians that took off from Wuhan (China) lands in Delhi.
కరోనా: వుహాన్​ నుంచి దిల్లీకి చేరుకున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్​

By

Published : Feb 1, 2020, 8:06 AM IST

Updated : Feb 28, 2020, 6:01 PM IST

ఎయిర్ ఇండియా జంబో బి747 విమానం వుహాన్ విమానాశ్రయం నుంచి బయలుదేరి దిల్లీకి చేరుకుంది. కరోనా తీవ్రస్థాయిలో వ్యాపిస్తున్న నేపథ్యంలో.. 324 మంది భారతీయ పౌరులను చైనా నుంచి భారత్​కు తీసుకొచ్చింది.

రెస్క్యూ ఆపరేషన్​

ఈ విమానంలో రామ్​ మనోహర్ లోహియా ఆసుపత్రికి చెందిన ఐదుగురు వైద్యులు, పారామెడికల్ సిబ్బంది ఇంజినీర్లు, భద్రతా సిబ్బంది కూడా ప్రయాణించారు. ఎయిర్ రెస్క్యూ డైరెక్టర్ (ఆపరేషన్స్​) కెప్టెన్​ అమితాబ్​సింగ్ నేతృత్వంలో ఈ రెస్క్యూ ఆపరేషన్​ జరిగింది.

ఈ విమానంలో ఐదుగురు కాక్​పిట్​ సిబ్బంది, 15 మంది క్యాబిన్ సిబ్బంది కూడా ప్రయాణించారు. అయితే ఆరోగ్య భద్రత రీత్యా వీరు ప్రయాణికులకు ఎలాంటి సేవలు అందించడం కానీ, కనీసం మాట్లాడడం కానీ చేయలేదు. ప్రయాణికులకు కావాల్సిన ఆహారాన్ని వారి సీట్ల వద్దే అందుబాటులో ఉంచారు.

చైనాలో ఇప్పటి వరకు కరోనా ధాటికి సుమారు 259 మంది మరణించారు. మరో 12 వేల మందికి వైరస్ సోకింది. అయితే మృతుల్లో భారతీయులు ఎవరూ లేరు. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా అక్కడి భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చారు.

మరో విమానం కూడా

వుహాన్​లో ఉన్న మరికొందరు భారతీయులను కూడా తీసుకొచ్చేందుకు.. మరో ప్రత్యేక విమానాన్ని కూడా అక్కడకు పంపించే అవకాశం ఉందని ఎయిర్​ ఇండియా ప్రతినిధి స్పష్టం చేశారు.

ఎయిర్ ఇండియా ఇంతకు ముందు కూడా లిబియా, ఇరాక్​, యెమెన్, కువైట్​, నేపాల్ వంటి దేశాల నుంచి ఇలాంటి రెస్క్యూ విమానాలను నడిపింది.

ఇదీ చూడండి: చిత్తడి నేలలు.. భూమికి ఊపిరితిత్తులు!

Last Updated : Feb 28, 2020, 6:01 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details