తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బిడ్డను చూడకుండానే కో పైలట్ మృతి - Air India crash:

కరోనా విజృంభిస్తున్నప్పటికీ.. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను ఇంటికి చేర్చేందుకే మొగ్గు చూపాడు. కానీ, ఆయనపై విధి ఆ కాస్త జాలికూడా చూపలేదు. కొద్ది రోజుల్లో తండ్రి కాబోతున్న ఆయన.. బిడ్డను చూడకుండానే ప్రాణాలు కోల్పోయాడు. అతడే కేరళ కోజికోడ్​లో ప్రమాదానికి గురైన ఎయిర్​ ఇండియా ఎక్స్​ప్రెస్​ కో పైలట్​ అఖిలేశ్​ శర్మ.

Air India crash
బిడ్డను చూడకుండానే కో పైలట్ మృతి

By

Published : Aug 8, 2020, 10:15 PM IST

కొద్ది రోజుల్లో తండ్రిని కాబోతున్న ఆనందంలో ఉన్నా.. విధి నిర్వహణకే ప్రాధాన్యమిచ్చి నిండు గర్భిణి అయిన భార్యను ఇంటి వద్దే ఉంచి విధులకు బయలుదేరాడు. కరోనా కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకువచ్చి, వారిని కుటుంబ సభ్యులతో కలపడమే ముఖ్యమనుకున్నాడు. కానీ, విధి మాత్రం ఆయన మీద అంత జాలి చూపించలేదు. దాంతో తాను ఇష్టంగా చేస్తోన్న ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే ప్రాణాలు కోల్పోయాడు. అతడే ఎయిర్​ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ కోపైలట్ అఖిలేశ్‌ శర్మ.

స్నేహితులు, బంధువులతో అఖిల్ అని ప్రేమగా పిలిపించుకొనే అఖిలేశ్ శర్మకు తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు తమ్ముళ్లు, సోదరి ఉన్న అందమైన కుటుంబం ఉంది. కరోనా కారణంగా లాక్‌డౌన్‌కు ముందు ఒకసారి మాత్రమే కుటుంబాన్ని కలుసుకున్నాడు. ఆయనకు 2017లో వివాహం జరగ్గా..ఇప్పుడు ఆయన భార్య మేఘ నిండు గర్భిణి. మరికొన్ని రోజుల్లో వాళ్లింటికి పండంటి బిడ్డ రాబోతుంది. కానీ, ఇప్పుడు కుటుంబానికి పెద్ద దిక్కు అయిన అఖిలేశ్‌ మాత్రం విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయాడు. అత్యంత బాధాకర విషయం ఏంటంటే ఇప్పటికీ ఆయన భార్యకు ఈ దుర్వార్తను కుటుంబసభ్యులు తెలియనివ్వలేదట.

కాగా, కేంద్రం చేపట్టిన వందే భారత్ మిషన్‌లో భాగంగా దుబాయ్‌కు బయలుదేరిన బృందానికి మే 8, 2020న కోజికోడ్​‌లోని విమానాశ్రయం వద్ద ఘన స్వాగతం లభించింది. అ బృందంలో అఖిలేశ్ కూడా ఉన్నారు. కానీ సరిగ్గా మూడు నెలల తరవాత ఆగస్టు 7న అదే చోట ఆయన విగతజీవిగా మారడం బాధాకరం. కాగా, ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర ఆయన సొంతూరు.

ఇదీ చూడండి: 'ఆయన, స్థానికుల వల్లే బతికున్నాం'

ABOUT THE AUTHOR

...view details