తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లోక్​సభపై ఎన్డీఏ పట్టు... మరి రాజ్యసభలో? - రాజ్య సభలో మెజారిటీకి ఎన్డీఏ వ్యూహాలు

రాజ్యసభలో ఎన్డీఏ కూటమి సొంత మెజారిటీకి చేరువలో ఉంది. జులై 5 తర్వాత కూటమి బలం మరింత పెరిగే అవకాశాలున్నాయి. ఇప్పటికే లోక్​సభలో భారీ అధిక్యంలో ఉన్న కమల దళం... ఎగువసభలోనూ పట్టు సాధిస్తే ఇక బిల్లుల ఆమోదానికి మార్గం సుగమం అవుతుందని భావిస్తోంది.

లోక్​సభలో ఎన్డీఏ హవా... మరి రాజ్యసభలో?

By

Published : Jun 26, 2019, 6:10 AM IST

Updated : Jun 26, 2019, 8:39 AM IST

లోక్​సభలో భారీ ఆధిక్యం భాజపా సొంతం. కానీ రాజ్యసభలో సరిపడ సంఖ్యా బలం లేదు. అందుకే ఎన్నో కీలక బిల్లులు ఇంకా ఎగువసభ దాటలేకపోతున్నాయి. అయితే మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం త్వరలోనే ఈ సమస్యను అధిగమించే అవకాశాలున్నాయి.

జులై 5 తర్వాత...

రాజ్యసభలో మొత్తం సీట్లు 245. ఓ పార్టీ సాధారణ మెజారిటీ పొందాలంటే కావల్సిన సీట్లు 123. ఇటీవలే తెదేపా రాజ్యసభ సభ్యులు నలుగురు భాజపాలో చేరారు. దీనివల్ల ఎగువసభలో భాజపా బలం 74కు చేరింది. జులై 5న సభలోని 6 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. వాటిలోని నాలుగింట్లో కాషాయ దళం గెలుపు సునాయాసం.

ఎన్డీఏ భాగస్వామ్యపక్షాలను కలిపితే 109 మంది సభ్యులు అధికార పక్షం తరఫున ఉన్నారు. స్వతంత్రులు, నామినేటెడ్​ సభ్యులు ఎలాగూ అధికార పార్టీకే మద్దతిస్తారు.

బీజేడీ, తెరాస, వైకాపాలకు 13 మంది రాజ్యసభ ఎంపీలున్నారు. ఇవి ప్రతిపక్షాలే అయినా భాజపాకు వ్యతిరేకమేమీ కాదు. కమలదళంతో ఆ పార్టీలకు స్నేహపూర్వక సంబంధాలున్నాయి. ఈ గణాంకాలు చూస్తే ఎగువసభలోనూ ఎన్డీఏ పట్టు సాధించే అవకాశాలున్నాయని స్పష్టమవుతోంది.

ఇదీ చూడండి: 'గాంధీలు కాని ప్రధానులపై కాంగ్రెస్ చిన్నచూపు'

Last Updated : Jun 26, 2019, 8:39 AM IST

ABOUT THE AUTHOR

...view details