తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'హురియత్​'పై నిషేధం?

వేర్పాటువాద సంస్థ హురియత్ కాన్ఫరెన్స్​ను నిషేధించడానికి కేంద్ర హోంమంత్రిత్వశాఖ సన్నద్ధమవుతోంది.

By

Published : Mar 1, 2019, 6:22 PM IST

Updated : Mar 2, 2019, 12:01 AM IST

ఆల్​ పార్టీ హురియత్​ కాన్ఫరెన్స్​

జమ్ముకశ్మీర్​లో అలజడులకు కారణమవుతున్న వేర్పాటువాద సంస్థ 'ఆల్​ పార్టీ హురియత్​ కాన్ఫరెన్స్​'ను నిషేధించడానికి కేంద్ర ప్రభుత్వం సమాయత్తమైంది. ఉగ్రవాద సంస్థ 'జమాతే ఇస్లామీ హింద్​'ను ఇప్పటికే నిషేధించిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు 'హురియత్'పై దృష్టి పెట్టింది. నిఘా సంస్థలు ఇందుకు సంబంధించిన నివేదికలను హోంమంత్రిత్వశాఖకు అందజేశాయి.

''తీవ్రవాద వ్యతిరేక పోరాటం కీలక దశలోకి వచ్చింది. 'హురియత్ కాన్ఫరెన్స్​' ఉగ్రవాదానికి మద్దతుగా, వేర్పాటువాద ధోరణులు ప్రదర్శిస్తోంది. అందుకే దేశ ద్రోహానికి పాల్పడుతున్న ఈ సంస్థను నిషేధించడంపై దృష్టి సారించామని'' తెలిపారు హోంమంత్రిత్వశాఖకు చెందిన అత్యున్నతాధికారి.

"'హురియత్​ కాన్ఫరెన్స్​' సిద్ధాంతాల వెనుక పాకిస్థాన్ ప్రేరేపిత 'జమాతే ఇస్లామీ హింద్​' ఉగ్రవాద సంస్థ హస్తం ఉంది. ఈ సంస్థ జమ్ముకశ్మీర్​లో వేర్పాటువాద ధోరణులను ప్రేరేపిస్తోంది."
-ఓ అధికారిక పత్రం ప్రకటన

దేశ విద్రోహ చర్యలకు పాల్పడుతూ, జమ్ముకశ్మీర్​లో అశాంతి, వేర్పాటువాద ధోరణులు చెలరేగడానికి జమాతే ఇస్లామీ కారణమవుతోంది. అందుకే 'చట్టవిరుద్ధ చర్యల నివారణ చట్టం' (యూఏపీఏ) సెక్షన్ 3 ప్రకారం 'జమాతే ఇస్లామీ హింద్'​ సంస్థపై తాజాగా 5 సంవత్సరాల నిషేధం విధించింది కేంద్ర హోంమంత్రిత్వశాఖ.

Last Updated : Mar 2, 2019, 12:01 AM IST

ABOUT THE AUTHOR

...view details