తెలంగాణ

telangana

By

Published : Mar 19, 2020, 6:19 PM IST

ETV Bharat / bharat

'ఏడేళ్ల తర్వాత నిర్భయ ఆత్మకు శాంతి'

ఉరి శిక్షను నిలిపివేయాలంటూ నిర్భయ దోషులు దాఖలు చేసిన పిటిషన్​ను దిల్లీ కోర్టు కొట్టి వేయటంపై నిర్భయ తల్లి స్పందించారు. కోర్టు తీర్పుతో ఏడు సంవత్సరాల తర్వాత తన కుమార్తె ఆత్మ శాంతిస్తుందని అన్నారు.

After 7 years, my daughter's soul will rest in peace: Nirbhaya's mother
'ఏడేళ్ల తర్వాత నా కూతురు ఆత్మ శాంతిస్తుంది'

ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు నిర్భయ దోషులు దాఖలు చేసిన పిటిషన్​ను దిల్లీ కోర్టు కొట్టివేసింది. కోర్టు తీర్పుపై స్పందించారు నిర్భయ తల్లి. కోర్టు నిర్ణయంతో ఏడేళ్ల తర్వాత తమ కుమార్తె ఆత్మకు శాంతి చేకూరుతుందని భావోద్వేగానికి గురయ్యారు.

"ఎట్టకేలకు దోషులకు ఉరిశిక్ష అమలు అవుతోంది. కోర్టు నిర్ణయంతో ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది.'

-ఆశా దేవి, నిర్భయ తల్లి

దిల్లీ కోర్టు డెత్​ వారెంట్​ జారీ చేసిన నేపథ్యంలో నిర్భయ దోషులకు రేపు ఉదయం 5.30 గంటలకు తిహార్​ జైల్లో మరణ శిక్ష అమలు చేయనున్నారు అధికారులు.

ఇదీ చూడండి:స్పైస్​జెట్​ సర్వీస్​లు రద్దు- కరోనానే కారణం

ABOUT THE AUTHOR

...view details