తెలంగాణ

telangana

By

Published : Apr 2, 2019, 7:36 PM IST

ETV Bharat / bharat

'ప్రత్యేక అధికారాల చట్టం' పాక్షిక సడలింపు

వివాదాస్పద సాయుధ దళాల(ప్రత్యేక అధికారాల) చట్టాన్ని అరుణాచల్ ప్రదేశ్​లోని మూడు జిల్లాల్లో పాక్షికంగా సడలిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వశాఖ ప్రకటించింది. మిగతా కల్లోలిత ప్రాంతాల్లో మరో 6 నెలలు పాటు కొనసాగుతుందని స్పష్టం చేసింది.

అరుణాచల్​ప్రదేశ్​లో సాయుధ దళాల (ప్రత్యేక అధికారాలు) చట్టం పాక్షిక ఉపసంహరణ

అరుణాచల్​ప్రదేశ్​లో సాయుధ దళాల (ప్రత్యేక అధికారాలు) చట్టం పాక్షిక సడలింపు

అరుణాచల్​ప్రదేశ్​లో 32 సంవత్సరాల తరువాత భద్రతాదళాలకు స్వీయ అధికారాలు కల్పించే వివాదాస్పద 'సాయుధ దళాల (ప్రత్యేక అధికారాలు) చట్టాన్ని' పాక్షికంగా సడలించింది కేంద్రం. అరుణాచల్​ ప్రదేశ్​లో మొత్తం 9 జిల్లాలున్నాయి. వీటిలో 3 జిల్లాల్లో మాత్రమే ఈ చట్టం పాక్షికంగా సడలించారు. మయన్మార్​ సరిహద్దు ప్రాంతాల్లో మాత్రం యథావిధిగా అమలుకానుంది.

జస్టిస్​ బీపీ జీవన్​రెడ్డి కమిటీ అరుణాచల్​ ప్రదేశ్​లో 'సాయుధ దళాల (ప్రత్యేక అధికారాల) చట్టం' రద్దు చేయాలని సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలో అరుణాచల్​ ప్రదేశ్​లోని నాలుగు పోలీసు స్టేషన్ల పరిధిలోని 'కల్లోలిత ప్రాంతాల్లో' (ఈ పదం హోంశాఖ తొలగించింది) ఆదివారం నుంచి సాయుధ దళాల (ప్రత్యేక అధికారాల) చట్టం అమలు నిలిపివేస్తున్నట్లు హోంమంత్రిత్వశాఖ ప్రకటించింది.

ఇకపై స్వేచ్ఛ లభించేనా..

ఇకపై పశ్చిమ కెమాంగ్​ జిల్లాలోని బలేము, బలుక్పాంగ్​, తూర్పు కెమాంగ్​ జిల్లాలోని సెయిజోసా, పపుంపరే జిల్లాలోని బలిజాన్​ పోలీసు స్టేషన్​ పరిధిలో ఈ చట్టం అమలు కాదు.
మరి కొంతకాలం వేచిచూడక తప్పదు

అరుణాచల్​ ప్రదేశ్​లోని ఉత్తర, ఈశాన్య ప్రాంతాల్లో ఎన్ఎస్​సీఎన్​, ఉల్ఫా, ఎన్​డీఎఫ్​బీ లాంటి నిషేధిత తీవ్రవాద సంస్థల కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని ఆయా ప్రాంతాల్లో ఈ చట్టం అమలు కొనసాగించాలని హోంమంత్రిత్వశాఖ నిర్ణయించింది.

తిరప్​, చాంగ్​లాంగ్​, లాంగ్​డింగ్​ జిల్లాలు, నామ్​సాయ్​ జిల్లాలోని మహదేవ్​పూర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో, దిగువ దిబాంగ్​ లోయ జిల్లాలోని రోయింగ్​, లోహిత్ జిల్లాలోని సన్​పురాలో మరో ఆరు నెలల (సెప్టెంబర్​ 30) వరకు ఈ చట్టం అమలు కానుంది.

ఇదీ నేపథ్యం..

పార్లమెంటు​ 1958లో ఈ 'సాయుధ దళాల (ప్రత్యేక అధికారాలు) చట్టం' రూపొందించింది. ఈ చట్టం ప్రకారం సాయుధ దళాలు ఎవరినైనా నిర్బంధించవచ్చు. ఏ ప్రదేశంలోనైనా తనిఖీ చేపట్టవచ్చు. చట్టాన్ని కేంద్రం గానీ, రాష్ట్రాలు గానీ అమలు చేయవచ్చు.

ఈ చట్టాన్ని అసోం, కేంద్రపాలిత ప్రాంతం మణిపూర్​లలో అమలుచేశారు. 1987 ఫిబ్రవరి 20న అవతరించిన అరుణాచల్ ప్రదేశ్​ దీనిని వారసత్వంగా పొందింది. తదనంతర కాలంలో మేఘాలయ, మిజోరం, నాగాలాండ్​లకూ ఈ చట్టం వర్తింపజేశారు.

గతేడాది మార్చిలో భద్రతా పరిస్థితిలో మెరుగుదల కారణంగా మేఘాలయలో సాయుధ దళాల (ప్రత్యేక అధికారాల) చట్టం అమలును పూర్తిగా తొలగించారు.

ఇదీ చూడండి:కశ్మీర్​: ముష్కరుల పాపం... ఉపాధికి శాపం

ABOUT THE AUTHOR

...view details