తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్​లో ఉగ్రఘాతుకం- ఈసారి న్యాయవాదిని..

జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. 24 గంటల వ్యవధిలో రెండో హత్య చేశారు. ఇవాళ సాయంత్రం 6.25 గంటల ప్రాంతంలో న్యాయవాది బాబర్​ ఖాద్రీపై కాల్పులు జరిపి పొట్టనబెట్టుకున్నారు.

By

Published : Sep 24, 2020, 7:52 PM IST

Update: Jammu and Kashmir Advocate Babar Qadri Shot Dead
కశ్మీర్​లో ఉగ్రఘాతుకం-ఈసారి న్యాయవాదిని..

జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శ్రీనగర్​లోని హవాల్​ ప్రాంతంలో న్యాయవాది బాబర్​ ఖాద్రీని పొట్టనబెట్టుకున్నారు. గుర్తుతెలియని ముష్కరులు.. కాల్పులు జరపగా ఆస్పత్రికి తీసుకెళ్లే లోపే ఖాద్రీ ప్రాణాలు విడిచారు.

న్యాయవాది బాబర్​ ఖాద్రీ

సాయంత్రం 6.25 గంటల ప్రాంతంలో ఉగ్రమూకలు న్యాయవాదిపై కాల్పులు జరిపారని పోలీసులు వెల్లడించారు.

ఫేస్​బుక్​లో తనపై వ్యతిరేక ప్రచారం నిర్వహించిన ఓ వ్యక్తిపై ఎఫ్​ఐఆర్​ నమోదుచేయాలని 3 రోజుల క్రితం ట్వీట్​ చేశారు ఖాద్రీ. ఈ ప్రకటనతో తనకు ప్రాణహాని ఉందని పేర్కొన్నారు. అదే అతడి చివరి ట్వీట్​.

న్యాయవాది ఖాద్రీ పలు టీవీ డిబేట్లలో కనిపించేవారు. స్థానిక వార్తాపత్రికలకు వ్యాసాలు రాస్తుంటారు. ఇది అక్కడి వేర్పాటువాదులకు నచ్చలేదని తెలుస్తోంది.

జమ్ముకశ్మీర్​లో 24 గంటల్లోనే ఇది రెండో హత్య. బుడ్గాం జిల్లాలో ఖాగ్​ బ్లాక్​ డెవలప్​మెంట్​ కౌన్సిల్​ సభ్యుడు భూపిందర్​ సింగ్​ను బుధవారం రాత్రి ఉగ్రవాదులు చంపారు.

ABOUT THE AUTHOR

...view details