తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అభినందన్​కు పరీక్షలు - పాకిస్థాన్​

వాయుసేన వింగ్​ కమాండర్ అభినందన్​​కు నేడు శారీరక, మానసిక పరీక్షలు జరగనున్నాయి. నిన్న రాత్రే దిల్లీ చేరుకున్నారు పైలట్​.

అభినందన్​

By

Published : Mar 2, 2019, 6:25 AM IST

Updated : Mar 2, 2019, 9:54 AM IST

అభినందన్​కు నేడే పరీక్షలు...!

వాయుసేన వింగ్​ కమాండర్​ అభినందన్​కు రక్షణ, నిఘా సంస్థల అధికారుల సమక్షంలో నేడు శారీరక, మాససిక పరీక్షలు జరగనున్నాయి. నిన్న రాత్రే దిల్లీ చేరుకున్నారు పైలట్​.

వాఘా సరిహద్దు వద్ద అభినందన్​ను భారత్​కు అప్పగించింది పాకిస్థాన్​. ప్రజలు అభినందన్​కు ఘన స్వాగతం పలికారు. దేశ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

ఇది జరిగింది..

పుల్వామా దాడి అనంతరం భారత​ వాయుసేన(ఐఏఎఫ్) పాక్​ ఆక్రమిత కశ్మీర్​లో జైషే మహమ్మద్​ ఉగ్రస్థావరాలపై దాడులు చేసింది. ఆ తర్వాత భారత మిలిటరీ స్థావరాలపై పాకిస్థాన్​ దాడి చేయటానికి ప్రయత్నించగా ఐఏఎఫ్​ ధీటుగా జవాబిచ్చింది.

ఇరు దేశాల మధ్య ఫిబ్రవరి 27న జరిగిన ఘర్షణలో మిగ్​-21 విమానం​ కూలిపోయింది. పైలట్​ అభినందన్​ పాక్​ సేనలకు బందిగా దొరికారు. భారత్​ చేసిన దౌత్య ప్రయత్నాలు ఫలించటంతో పాకిస్థాన్​ మూడు రోజల అనంతరం అభినందన్​ను తిరిగి అప్పగించింది.

Last Updated : Mar 2, 2019, 9:54 AM IST

ABOUT THE AUTHOR

...view details