లాక్డౌన్ సడలించిన తర్వాత దేశంలో విక్రయించే అన్ని స్మార్ట్ఫోన్లలోనూ 'ఆరోగ్య సేతు' యాప్ తప్పనిసరి కానుంది. దీన్ని ఇన్-బిల్ట్ ఫీచరుగా అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. "స్మార్ట్ఫోన్లలో ప్రీ-ఇన్స్టాల్డ్ ఫీచరుగా 'ఆరోగ్య సేతు' ఉండనుంది. కొత్త ఫోన్లను కొనేవారు ముందుగా ఈ యాప్ను రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాతే ఫోన్లు పనిచేయడం ప్రారంభిస్తాయి" అని ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు.
కొత్త స్మార్ట్ఫోన్లలో 'ఆరోగ్య సేతు' తప్పనిసరి - స్మార్ట్ఫోన్లలో ఆరోగ్య సేతు తప్పని సరి
ఇకపై స్మార్ట్ఫోన్లలో 'ఆరోగ్య సేతు' తప్పనిసరి కానుంది. లాక్డౌన్ తర్వాత విక్రయించే స్మార్ట్ఫోన్లు అన్నింటిలో ఈ యాప్ను ఇన్బిల్ట్గా తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది.
ఆరోగ్య సేతు తప్పనిసరి