తెలంగాణ

telangana

By

Published : Jun 19, 2020, 12:52 PM IST

Updated : Jun 19, 2020, 2:04 PM IST

ETV Bharat / bharat

అఖిలపక్ష భేటీకి 'ఆప్'కు అందని ఆహ్వానం​

సరిహద్దులో చెలరేగిన ఘర్షణపై చర్చించేందుకు శుక్రవారం సాయంత్రం నిర్వహించనున్న అఖిలపక్ష భేటీకి తమను ఆహ్వానించకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది ఆమ్​ఆద్మీ పార్టీ. దిల్లీలో ప్రభుత్వం, పంజాబ్​లో ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న తమను ఆహ్వానించకపోవడం సరికాదని వ్యాఖ్యానించింది.

aap
సరిహద్దు ఘర్షణపై అఖిలపక్షానికి మాకు ఆహ్వానం రాలేదు: ఆప్

సరిహద్దు ఉద్రిక్తతలపై శుక్రవారం సాయంత్రం నిర్వహించనున్న అఖిలపక్ష సమావేశానికి ఆప్​కు ఆహ్వానం అందలేదని ప్రకటించారు ఆ పార్టీ నేతలు. దిల్లీలో ప్రభుత్వాన్ని నడుపుతూ.. పంజాబ్​ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న ఆప్​ను ఆహ్వానించకపోవడం సరికాదని వ్యాఖ్యానించారు. ఆప్ నేత సంజయ్ సింగ్ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. జాతీయ అత్యవసర పరిస్థితి వంటి సందర్భంలో అన్ని పార్టీలు ఐక్యం కావాలని చెప్పారు.

"దురహంకార పూరిత ప్రభుత్వం కేంద్రంలో ఉంది. ప్రస్తుతం ఆమ్ఆద్మీ పార్టీ దిల్లీలో అధికారంలో ఉంది. పంజాబ్​లో ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. దేశవ్యాప్తంగా నలుగురు ఎంపీలు ఉన్నారు. అయినప్పటికీ సరిహద్దు వివాదం వంటి కీలక అంశంలో భాజపా మా అభిప్రాయాన్ని వినాలని అనుకోవట్లేదు. సమావేశంలో ప్రధాని ఏం చెబుతారనే దానిపై దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది."

-సంజయ్ సింగ్, ఆప్ నేత

దురదృష్టకర పరిణామం..

ఆప్​ను ఆహ్వానించకపోవడంపై స్పందించారు దిల్లీ ప్రభుత్వ మంత్రి గోపాల్ రాయ్. అన్ని పార్టీలను ఒకే తాటిపైకి తీసుకురావాల్సిన సమయంలో ఎవరిని అఖిలపక్షానికి ఆహ్వానించాలనే అంశమై భాజపా మేథమేటిక్స్ ఫార్ములాలు వినియోగిస్తోందని చెప్పారు.

ఇదీ చూడండి:ఈ ఇనుప చువ్వలతోనే చైనా సైనికుల దాడి?

Last Updated : Jun 19, 2020, 2:04 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details