తెలంగాణ

telangana

By

Published : Oct 7, 2020, 4:16 PM IST

Updated : Oct 7, 2020, 5:16 PM IST

ETV Bharat / bharat

కరోనాతోనే 'హాథ్రస్'​కు ఎమ్మెల్యే ఓదార్పు యాత్ర

కరోనా బారినపడి హాథ్రస్​ అత్యాచార బాధితురాలి కుటుంబాన్ని కలిసిన ఎమ్మెల్యేపై యూపీ పోలీసులు కేసు నమోదు చేశారు. కొవిడ్-19 నిబంధనలు ఉల్లంఘించారంటూ అంటువ్యాధుల చట్టం కింద చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

aap mla
ఆప్ ఎమ్మెల్యే

హాథ్రస్ బాధితురాలి కటుంబాన్ని కలిసిన ఆమ్​ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే కుల్​దీప్​ కుమార్​పై పోలీసులు కేసు నమోదు చేశారు. కొవిడ్​-19 నిబంధనలు ఉల్లంఘిస్తూ కరోనా పాజిటివ్​గా తేలిన తర్వాత హాథ్రస్​ వెళ్లినందుకు అంటువ్యాధుల చట్టం కింద ఎఫ్​ఐఆర్​ నమోదుచేశారు.

తనకు కరోనా పాజిటివ్​గా తేలిందని సెప్టెంబర్​ 29న దిల్లీలోని కోండ్లీ ఎమ్మెల్యే ట్విట్టర్​ వేదికగా తెలిపారు. అనంతరం అక్టోబర్​ 4న హాథ్రస్ బాధితురాలి కుటుంబాన్ని కలిశారు. కొవిడ్​-19 నిబంధనల ప్రకారం.. 14 రోజులు ఐసోలేషన్​ ఉండాల్సి ఉందని, ఈ మేరకు ఆయనకు నోటీసులు పంపుతామని స్పష్టం చేశారు పోలీసులు.

ఇదీ చూడండి:హాథ్రస్ ఘటనపై 'సిట్'‌ నివేదిక ఆలస్యం

Last Updated : Oct 7, 2020, 5:16 PM IST

ABOUT THE AUTHOR

...view details