తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'విమాన ప్రమాద కారణాలపై ఇప్పుడే ఏం చెప్పలేం' - కోజికోడ్​ విమాన ప్రమాదం

కోజికోడ్​ విమాన ప్రమాదానికి గల కారణాలను ఇప్పుడే అంచనా వేయలేమన్నారు ఏఏఐబీ విభాగాధిపతి అరబిందో హండ. ఈ ఘటనపై అధికారిక దర్యాప్తు చేపడుతున్నామని, ఇందుకోసం ఆధారాలను సేకరిస్తున్నామని వెల్లడించారు.

AAIB chief says too premature to make initial assessment of Kozhikode plane crash
'విమాన ప్రమాద కారణాలపై ఇప్పుడే ఏం చెప్పలేం'

By

Published : Aug 12, 2020, 2:48 PM IST

కేరళ కోజికోడ్​ విమాన ప్రమాద ఘటనపై అధికారిక దర్యాప్తు చేపట్టేందుకు ఆధారాలను సేకరిస్తున్నట్టు ఏఏఐబీ(విమాన ప్రమాద దర్యాప్తు సంస్థ) చీఫ్​ అరబిందో హండ తెలిపారు. అయితే ప్రమాదానికి గల కారణాలను ఇప్పుడే ప్రాధమికంగా అంచనా వేయలేమన్నారు.

విమాన నిబంధనలు(ప్రమాదాల దర్యాప్తు)-2017, ఐసీఏఓ ఆన్నెక్స్​ 13 కింద దర్యాప్తు చేస్తున్నట్టు హండ వెల్లడించారు.

"ప్రమాదాలను నివారించడం ఈ దర్యాప్తు ముఖ్య లక్ష్యం. అందువల్ల ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు జరుగుతుంది. అన్ని కారణాలను పరిగణనలోకి తీసుకుంటాం. అందువల్ల అసలు ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై ఇప్పుడే ఓ అంచనాకు రావడం సరైనది కాదు."

--- అరబిందో హండ, ఏఏఐబీ చీఫ్​.

ప్రమాదంలో పైలట్లు లేదా ఏటీసీ(ఎయిర్​ ట్రాఫిక్​ కంట్రోలర్​) వైఫల్యం ఉందా అని ప్రశ్నించగా.. 'ఈ విషయాలపై దర్యాప్తు జరుగుతోంది. ఈ సమయంలో ఇలాంటి ప్రశ్నలకు స్పందించడం సరైనది కాదు' అని బదులిచ్చారు హండ. ఈ దర్యాప్తులో తమకు అవసరం ఉంటే విదేశీ సంస్థల సహాయం కూడా తీసుకుంటామని స్పష్టం చేశారు.

85 మంది డిశ్చార్జ్​...

ప్రమాద ఘటనలో గాయపడ్డ 85 మంది ప్రయాణికులు బుధవారం డిశ్చార్జ్​ అయినట్టు ఎయిర్​ ఇండియా ఎక్స్​ప్రెస్​ ఓ ప్రకటన విడుదల చేసింది.

"నేటి వరకు.. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన 85 మంది డిశ్చార్జ్​ అయ్యారు. వీరందరూ పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్టు వైద్యులు ధ్రువీకరించారు."

--- ఎయిర్​ ఇండియా ఎక్స్​ప్రెస్​.

ఈ నెల 7న దుబాయి నుంచి కోజికోడ్‌ విమానాశ్రయానికి వచ్చిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం రన్‌వే పైనుంచి జారిపడి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 18 మంది మృతి చెందారు.

ఇదీ చూడండి:-వర్షాకాలంలో కోజికోడ్​ విమానాశ్రయం మూసివేత

ABOUT THE AUTHOR

...view details