తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అమర జవాన్లకు ఓ గుడి ఉందని తెలుసా? - Ujjain Martyrs temple news

హిందూ ప్రఖ్యాత పుణ్యక్షేత్రాల్లో ఒకటైన ఉజ్జయిని​లో అమర జవాన్ల జ్ఞాపకార్థం ఓ ఆలయాన్ని నిర్మించారు. భావి తరాలకు అమరుల గొప్పతనాన్ని తెలియజేసేందుకు 50మంది విగ్రహాలను ఏర్పాటు చేశారు. 'భారత  సేవకుల ఆలయం' పేరుతో ఓ రిటైర్డ్ జడ్జి ఈ గుడి కట్టించారు.

A temple dedicated to Martyrs
అమర జవాన్లకు ఓ గుడి

By

Published : Jan 27, 2020, 1:57 PM IST

Updated : Feb 28, 2020, 3:27 AM IST

అమర జవాన్లకు ఓ గుడి ఉందని తెలుసా?

హిందూ ప్రధాన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా పరిగణించే మధ్యప్రదేశ్​ ఉజ్జయినిలో సైనికులు, అమరవీరుల త్యాగాలకు గుర్తుగా ఓ ఆలయాన్ని నిర్మించారు. దేశ రక్షణ కోసం ప్రాణాలను పణంగా పెట్టిన 50మంది అమరుల విగ్రహాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. నగరంలోని నర్సింగ్ ఘాట్​ వద్ద ఉన్న ఈ గుడికి భారత సేవకుల ఆలయంగా నామకరణం చేశారు. విగ్రహాలపై అమరుల వీర గాథలను రాసి ఉంచారు.

భారత మొదటి సైన్యాధిపతి కె.ఎం. కరియప్ప, మొదటి ఫీల్డ్​ మార్షల్​ జనరల్​ సామ్​ మనేక్షా, వాయుసేన మాజీ అధిపతి అర్జున్​ సింగ్​ సహా పలువురి అమరుల ప్రతిమలు ఆలయంలో ఉన్నాయి. వారి శౌర్యం, సంకల్ప శక్తి భారత త్రివిధ దళాల్ని దేశానికి గర్వకారణం చేశాయి.

సైనికుల త్యాగాలకు జ్ఞాపకంగా ఈ ఆలయాన్ని విశ్రాంత జడ్జి దాన్​ సిగ్ చౌదరి కట్టించారు. పదవీ విరమణ చేశాక వచ్చిన డబ్బుతో దీనిని నిర్మించారు. ప్రస్తుతానికి ఆయన లేకపోయినా అమరవీరుల కోసం కట్టించిన గుడి భావి తరాలకు నిజమైన వీరుల చరిత్రను తెలిజేస్తుందని ఆలయ పూజారి రామ్​ సింగ్ చెబుతున్నారు.

దాన్​ సింగ్​ సింగ్​ అనుకున్న లక్ష్యం విజయవంతమైందని.. ఇక్కడి స్థానికులు ఈ ఆలయంలో రోజూ పూజలు నిర్వహిస్తున్నారని రామ్​ సింగ్ తెలిపారు. ఇటువైపుగా వెళ్లేవారంతా గొప్ప వీరులను స్మరించుకుని పూజిస్తారని చెప్పారు.

గణతంత్ర దినోత్సవం రోజున ఈ ఆలయాన్ని అనేక మంది సందర్శించారు.

ఇదీ చూడండి: ఆ చిన్నారి జ్ఞాపక శక్తికి అవార్డులు దాసోహం.. ఏడేళ్లకే డాక్టరేట్​

Last Updated : Feb 28, 2020, 3:27 AM IST

ABOUT THE AUTHOR

...view details