తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇంట్లో కుమారుడి మృతదేహంతో 3 రోజులు...

తనకు అండగా నిలుస్తాడనుకున్న కొడుకు అర్ధంతరంగా వదిలేసి పరలోకానికి వెళ్లాడు. అతడి మృతదేహానికి అంత్యక్రియలు జరిపించలేకపోయింది ఆ మాతృమూర్తి. అనారోగ్యం కారణంగా మూడు రోజులపాటు మృతదేహంతోనే ఉండిపోయింది. ఈ ఘటన దక్షిణ కోల్​కతాలోని రామ్​గఢ్​లో జరిగింది.

By

Published : Aug 3, 2019, 11:02 AM IST

Updated : Aug 3, 2019, 1:31 PM IST

ఇంట్లో కుమారుడి మృతదేహంతో 3 రోజులు...

ఇంట్లో కుమారుడి మృతదేహంతో 3 రోజులు...

అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మాతృమూర్తి... కుమారుడి మృతదేహంతో మూడు రోజుల పాటు నివసించింది. ఈ ఘటన దక్షిణ కోల్‌కతాలో జరిగింది.

నేతాజీనగర్​ పోలీస్​స్టేషన్​ పరిధిలోని రామ్‌గఢ్‌లో నివసించే సోమ్‌నాథ్‌ కుందు (39) అనే ఓ వ్యక్తి మూడు రోజుల క్రితం మరణించాడు. అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి... అంత్యక్రియలు జరిపించలేకపోయింది. మూడు రోజుల పాటు అతడి మృతదేహం పక్కనే ఉండిపోయింది.

ఇంటి నుంచి దుర్వాసన రావడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపారు. అతని తల్లిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇదీ చూడండి: 'మేం హిందుస్థానీ.. మా వీధి పాకిస్థానీ'

Last Updated : Aug 3, 2019, 1:31 PM IST

ABOUT THE AUTHOR

...view details