అధికరణ 370, 35ఏ రద్దుకు భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రకమని కొనియాడారు పలువురు భాజపా నేతలు.
చారిత్రక నిర్ణయం: జైట్లీ
ఆర్టికల్ 370 రద్దు జాతీయ సమైక్యత వైపుగా ఒక విప్లవాత్మక నిర్ణయమని పేర్కొన్నారు కేంద్ర మాజీ మంత్రి అరుణ్జైట్లీ. ప్రత్యేక హోదా వేర్పాటువాదానికి దారితీస్తుందన్నారు. ఈ పరిస్థితిని కొనసాగించడానికి ఏ దేశం అంగీకరించదని తన బ్లాగ్లో రాసుకొచ్చారు జైట్లీ. ప్రభుత్వ నిర్ణయం జమ్ముకశ్మీర్ ప్రజలకు, రాష్ట్రానికి ఎంతో లాభం చేకూర్చుతుందన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను అభినందించారు.