తెలంగాణ

telangana

ఫొని గడిచి నెలయినా అంధకారంలోనే ఒడిశా

By

Published : Jun 4, 2019, 5:44 PM IST

Updated : Jun 4, 2019, 8:15 PM IST

సముద్ర తీర రాష్ట్రం ఒడిశా.. ఫొని తుపాను ప్రభావం నుంచి ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదు. లక్షలాది మంది ఇంకా అంధకారంలోనే గడుపుతున్నారు. పూరీ పట్టణం ఫొని వల్ల ఎక్కువ నష్టానికి గురైంది.

ఫొని గడిచి నెలయినా అంధకారంలోనే ఒడిశా

ఫొని గడిచి నెలయినా అంధకారంలోనే ఒడిశా

నెల క్రితం ఫొని తుపాను ఒడిశాను అతలాకుతలం చేసింది. ఇది సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. అయితే.. ఇప్పటికీ తుపాను ప్రభావం నుంచి రాష్ట్రం పూర్తిగా కోలుకోలేదు. లక్షా 64 వేల కుటుంబాలకు చెందిన 5 లక్షల మందికి పైగా ఇంకా అంధకారంలోనే జీవనం సాగిస్తున్నారు.

అత్యంత ఎక్కువగా ప్రభావితమైన పూరీలో 52 శాతం విద్యుత్తు పనులను మాత్రమే పునరుద్ధరించారు. మే 3న తీవ్రమైన వర్షాలు ఇక్కడి ప్రజల్ని బెంబేలెత్తించాయి.
ఫొని ధాటికి రాష్ట్రవ్యాప్తంగా 64 మంది మృతి చెందారు. మృతులు పూరీలోనే అత్యధికంగా 39 మంది ఉన్నారు. ఈ తుపాను రాష్ట్రంలోని 14 జిల్లాల్లో కోటీ 65 లక్షల మందికి పైగా ప్రజల్ని ప్రభావితం చేసింది.

మొత్తం 25 లక్షలకు పైగా ఇళ్లల్లో విద్యుత్తు నిలిచిపోగా.. 23 లక్షల గృహాలకు విద్యుత్తును పునరుద్ధరించినట్లు వెల్లడించారు అధికారులు. బ్యాంకింగ్​, టెలికాం, త్రాగు నీరు, ఇతర సేవలు గతం కంటే మెరుగైనట్లు పేర్కొన్నారు. మిగతా పనులను వేగవంతం చేసినట్లు తెలిపారు.

Last Updated : Jun 4, 2019, 8:15 PM IST

ABOUT THE AUTHOR

...view details