ఛత్తీస్గఢ్ బస్తర్ జిల్లాలో ఒక ప్రత్యేక వివాహం జరిగింది. ఒక యువకుడు ఒకే మండపంలో ఒకేసారి ఇద్దరు యువతులను పెళ్లిచేసుకున్నాడు. జగదల్పుర్ పట్టణం సమీపంలోని టిక్రా లోహంగా గ్రామంలో జనవరి 3న జరిగిందీ ఘటన. గిరిజన సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వివాహానికి ఊళ్లో వారంతా అంగీకరించడం గమనార్హం. అందరికీ పెళ్లికార్డులు కూడా పంచిపెట్టాడా వరుడు.
ఊరందరి సమక్షంలోనే పెళ్లికొడుకు చందూ మౌర్య.. ఇద్దరు వధువులు హసీనా బఘేల్, సుందరి కశ్యప్లను మనువాడాడు. వారితో ఏడడుగులు నడిచాడు. వారిప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు.