తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బస్సులో దొరికిన రూ.3.47కోట్లు ఎవరివి?

తమిళనాడు ధర్మపురి జిల్లాకు చెందిన ఓ కండక్టర్​ నిజాయితీ చాటుకున్నాడు. బస్సులో ఎవరో వదిలివెళ్లిన రూ.3.47కోట్ల విలువైన నగదును ఎన్నికల తనిఖీ బృందానికి అప్పగించాడు.

By

Published : Apr 4, 2019, 1:51 AM IST

Updated : Apr 4, 2019, 7:46 AM IST

కండక్టర్​ అప్పగించిన నగదు

కండక్టర్​ అప్పగించిన రూ.3.47కోట్ల నగదు
రూ.3కోట్ల47లక్షల నగదును ఎన్నికల తనిఖీ అధికారుల బృందానికి అప్పగించాడు తమిళనాడు ధర్మపురి జిల్లాకు చెందిన టీఎన్​ఎస్​టీసీ బస్సు కండక్టర్ సెల్వరాజ్. బస్సులో ఎవరో వ్యక్తులు ఈ డబ్బును వదిలివెళ్లారు. మొత్తం ఏడు బ్యాగుల్లో డబ్బు కట్టలు ఉన్నాయి. నగదును అప్పగించిన కండక్టర్​ నిజాయితీని ప్రశంసించారు అధికారులు. ఆ డబ్బు తమదేనంటూ అధికారుల వద్దకు ఇంకా ఎవరూ రాలేదు.

ఎన్నికల షెడ్యూలు ప్రకటించినప్పటి నుంచి తమిళనాడు వ్యాప్తంగా పెద్ద మొత్తంలో నగదు పట్టుబడుతోంది. ఎన్నికల సంఘం, ఆదాయ పన్ను శాఖ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు.

Last Updated : Apr 4, 2019, 7:46 AM IST

ABOUT THE AUTHOR

...view details