కర్ణాటక చిక్మంగళూరు ప్రభుత్వ ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు వైద్యులు. ఓ మహిళ కడుపులో నుంచి 18కిలోల భారీ కణతిని విజయవంతంగా తొలగించారు.
శివమొగ్గ జిల్లాకు చెందిన 45ఏళ్ల షఫురాభి కొద్ది కాలంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతోంది. రోజురోజుకూ బరువు పెరుగుతూ వచ్చింది. పొట్ట భారీగా పెరిగిపోయింది. అయితే కొవ్వు కారణంగానే ఉదర భాగం పెరిగి ఉండొచ్చని ముందుగా అనుమానించింది షఫురాభి. కానీ ఆస్పత్రికి వెళ్లిన తర్వాత అసలు నిజం బయటపడింది. వైద్యులు స్కానింగ్ నిర్వహించగా.. కడుపులో భారీ కణతి ఉందని తేలింది.
వైద్యుల ఆశ్చర్యం