తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వరద నీటిలో యువతి కిరాక్​ ఫొటోషూట్​ - అదితి సింగ్... ఫ్యాషన్​ డిజైనింగ్​ విద్యార్థిని

వరద పరిస్థితుల్లో చాలా మంది ఇళ్లకే పరిమితమవుతారు. ఎంత పెద్ద పని ఉన్నా పక్కనపెడతారు. బయటకు రావాలంటే చిరాకుపడుతారు. కానీ బిహార్​ రాజధాని పట్నాలోని ఓ యువతి మాత్రం రోడ్డుపైకి వచ్చి వరద నీటిలో ఫొటోలకు అందంగా ఫోజులిచ్చింది. ఇలా ఎందుకు చేసిందంటే...

వరద నీటిలో యువతి కిరాక్​ ఫొటోషూట్​

By

Published : Sep 30, 2019, 4:35 PM IST

Updated : Oct 2, 2019, 2:46 PM IST

దేశవ్యాప్తంగాబిహార్​ వరదల అంశం చర్చనీయాంశమైన తరుణంలో అదే రాష్ట్రానికి చెందిన ఓ యువతి సామాజిక మాధ్యమాల్లో హాట్​ టాపిక్​గా మారింది. భారీ వర్షాలకు బిహార్​ రాజధాని పట్నాలో దాదాపు అన్ని రోడ్లు జలమయమైన వేళ... ఈ యువతి మాత్రం అదే వరద నీటి మధ్య నిలబడి ఫొటోషూట్​ చేసింది. ఇప్పుడు ఆ చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

అదితి ఫొటోషూట్​
బిహార్​ యువతి వినూత్న ఆలోచన

ఫొటోషూట్​ వెనుక అసలు కారణం...

అదితి సింగ్... ఫ్యాషన్​ డిజైనింగ్​ విద్యార్థిని​. తన వృత్తి ద్వారా పట్నాలోని తాజా పరిస్థితులను చూపించాలనుకుంది. అందుకే ఇలా ఫొటోషూట్​ చేసింది.
అదితి ఫొటోలపై సామాజిక మాధ్యమాల్లో విభిన్న స్పందనలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు ఈ వినూత్న ఆలోచనను అభినందిస్తుంటే.. మరికొందరు ఫొటోషూట్​ను వ్యతిరేకిస్తూ యువతిని ట్రోల్​ చేస్తున్నారు. ​

ఫ్యాషన్​ డిజైనింగ్​ విద్యార్థిని
వైరల్​గా మారిన చిత్రాలు
వరద నీటిలో ఫొటోషూట్​
Last Updated : Oct 2, 2019, 2:46 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details