చేతికి చిన్న గాయం అయితేనే నొప్పితో విలవిల్లాడిపోతాం. అలాంటిది శరీరానికి ఏకంగా ఇనుప కడ్డీని గుచ్చి ఓ క్రేనుకు వేలాడదీస్తూ కిలోమీటర్ల మేర ఊరేగిస్తున్నారు కర్ణాటక బళ్లారి జిల్లా కడ్డి రామ్పురా గ్రామస్థులు. ఇదేంటని అడిగితే అది తమ ఆచారమని చెబుతున్నారు.
మనిషిని క్రేన్కు వేలాడదీసి 2కి.మీ ఊరేగింపు
ఓ వైపు సాంకేతికత, అభివృద్ధి అంటూ ప్రపంచం పరుగులు పెడుతుంటే.. మరోవైపు ప్రజలు మూఢ నమ్మకాలను విశ్వసిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కర్ణాటక బళ్లారిలో ఓ వింత ఆచారం అక్కడి ప్రజల ప్రాణాలకు ముప్పులా మారింది. ఇంతకీ ఆ ఆచారం ఏమిటో చూద్దాం.
ప్రతి ఏడాది భద్రకాళి అమ్మవారి ఉత్సవాల సందర్భంగా కొంతమంది గ్రామస్థుల వీపునకు ఇనుప కడ్డీలు గుచ్చి వారిని క్రేన్కు వేలాడదీస్తారు. ఆ ఊరి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అమ్మవారి దేవాలయానికి ఊరేగింపుగా తీసుకెళ్తారు. అనంతరం వారు మొక్కులు చెల్లించుకుంటారు. ఆ తర్వాత ఆలయం ఎదురుగా ఉన్న నిప్పుల గుండాన్ని దాటుతారు. ఇలా చేస్తే తమ కష్టాలు తొలగిపోతాయని అక్కడి భక్తులు విశ్వాసం. కొంతమంది ఇదో రకమైన ఆచారమని చెబుతుంటే.. మరికొంత మంది మాత్రం ఇది పూర్తిగా మూఢ నమ్మకమని అంటున్నారు.
ఇదీ చదవండి:రోజుకు 7 సార్లు రంగు మార్చే శివ లింగం!