తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చిదంబరం మధ్యంతర బెయిల్​పై నేడు విచారణ

చిదంబరం అరెస్టుపై దాఖలైన మధ్యంతర బెయిల్​ పిటిషన్​ను దిల్లీ కోర్టు నేడు విచారించనుంది. చిదంబరం సీబీఐ కస్టడీ కూడా నేటితోనే ముగియనుంది.

By

Published : Sep 3, 2019, 5:00 AM IST

Updated : Sep 29, 2019, 6:06 AM IST

చిదంబరం మధ్యంతర బెయిల్​పై నేడు విచారణ

ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులో సీబీఐ అరెస్టును సవాలు చేస్తూ కేంద్ర మాజీ ఆర్థికమంత్రి చిదంబరం తరఫు న్యాయవాది దాఖలు చేసిన మధ్యంతర బెయిల్​ పిటిషన్​పై నేడు దిల్లీ కోర్టు విచారణ చేపట్టనుంది. ప్రత్యేక న్యాయమూర్తి అజయ్​ కుమార్​ మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు మధ్యంతర బెయిల్​ పిటిషన్​ను విచారించనున్నారు.

సీనియర్​ న్యాయవాది కపిల్​ సిబాల్​ ఈ మధ్యంతర బెయిల్​ పిటిషన్​ను దాఖలు చేశారు.

మరోవైపు ఐఎన్​ఎక్స్​ కేసులో చిదంబరం సీబీఐ కస్టడీ నేటితో ముగియనుంది. నిజానికి నిన్ననే కస్టడీ ముగియాల్సి ఉంది. కస్టడీని దిగువ కోర్టు నేటికి పొడిగించింది. నిన్నటితో 3 రోజుల గడువు ముగిసిన నేపథ్యంలో చిదంబరాన్ని దిల్లీ కోర్టు ముందు హాజరు పరిచారు సీబీఐ అధికారులు.

యూపీఏ సర్కారు హయాంలో విదేశీ నిధులను ఐఎన్​ఎక్స్​ మీడియా గ్రూప్​ సంస్థకు అక్రమంగా నిధులు మళ్లించేందుకు సహకరించారన్న ఆరోపణలతో ఆగస్టు 21న చిదంబరాన్ని సీబీఐ అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఆయన సీబీఐ కస్టడీలోనే ఉన్నారు.

ఇదీ చూడండి:- ఎయిర్​సెల్​ కేసులో చిదంబరం కస్టడీకి సీబీఐ, ఈడీ విజ్ఞప్తి

Last Updated : Sep 29, 2019, 6:06 AM IST

ABOUT THE AUTHOR

...view details