తెలంగాణ

telangana

By

Published : Feb 12, 2020, 8:56 AM IST

Updated : Mar 1, 2020, 1:36 AM IST

ETV Bharat / bharat

జమ్మూ భవనం కూలిన ఘటనలో ఇద్దరి మృతి

జమ్ముకశ్మీర్​ తలాబ్​ తిల్లీ ప్రాంతంలోని ఓ భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. అనంతరం భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. శిథిలాల్లో చిక్కుకున్న మరో అగ్నిమాపక సిబ్బందిని బయటకు తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు చేపడుతున్నారు.

building collapsed
జమ్ములో అగ్నిప్రమాదం

జమ్ముకశ్మీర్​లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జమ్మూలోని తలాబ్ తిల్లీ ప్రాంతంలోని మూడంతస్తుల భవనంలో ఉదయం 3 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. మంటల ధాటికి భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది శిథిలాల కింద చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి.

శిథిలాల కింద చిక్కుకున్న వారిలో ఇద్దరు సిబ్బంది, ఓ పౌరుడిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. వారిని ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. అగ్నిమాపక సిబ్బందికి చెందిన మరొక వ్యక్తి శిథిలాల కిందే ఉన్నట్లు అధికారులు తెలిపారు.

అతడిని బయటకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అగ్నిమాపక బృందాలు, రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలతో పాటు ఎన్​డీఆర్​ఎఫ్​ సిబ్బంది సైతం సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.

భవనంలో ఉన్న టింబర్​ మిల్లులో అధిక కలప నిల్వలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అదే సమయంలో సిలిండర్​ కూడా పేలడం వల్ల భారీగా మంటలు చెలరేగి భవనం కూలిపోయినట్లు వెల్లడించారు.

అగ్ని ప్రమాదం సంభవించి కుప్పకూలిన భవనం
Last Updated : Mar 1, 2020, 1:36 AM IST

ABOUT THE AUTHOR

...view details