తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నిబంధనలు పాటించమని చెప్పిన ఎమ్మెల్యేకే జరిమానా​!

ఓ శాసనసభ్యుడు ట్రాఫిక్ నిబంధనలను పాటించండి అంటూ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వచ్చారు. కానీ... అదే సమయంలో ఆయనకు పోలీసులు జరిమానా విధించారు. శాసనసభ్యుడు కారును నో పార్కింగ్​ జోన్​లో నిలపడమే ఇందుకు కారణం.

By

Published : Sep 9, 2019, 3:03 PM IST

Updated : Sep 29, 2019, 11:58 PM IST

నిబంధనలు పాటించమని చెప్పిన ఎమ్మెల్యేకే జరిమానా​!

నిబంధనలు పాటించమని చెప్పిన ఎమ్మెల్యేకే జరిమానా​!
ఒడిశా​లో అధికార బిజూ జనతా దల్​ ఎమ్మెల్యే అనంత నారాయణ్ జెనాకు అనూహ్య అనుభవం ఎదురైంది. ట్రాఫిక్​ నిబంధనలు పాటించమని అవగాహన కల్పించేందుకు వచ్చిన ఆయనే జరిమానా చెల్లించాల్సి వచ్చింది.

ఆదివారం ఎమ్మెల్యే జెనా భువనేశ్వర్​లో ట్రాఫిక్​ నిబంధనలపై అవగాహన కార్యక్రమానికి హాజరయ్యారు. నిబంధనలను సక్రమంగా పాటించిన వారికి ధన్యవాదాలు చెబుతూ చాక్లెట్లు, పుష్పాలు అందించారు. ఆ సమయంలో జెనా వాహనం నో పార్కింగ్​ జోన్​లో నిలిపి ఉంచడాన్ని పోలీసులు గుర్తించారు. వెంటనే 500 రూపాయలు జరిమానా విధించారు.

"నా కారు డ్రైవర్​ వాహనాన్ని తప్పుగా పార్క్​ చేశారు. చట్టం అందరికీ ఒకటే. అందుకే నాకు జరిమానా విధించారు. మనం ట్రాఫిక్​ నిబంధనలను పాటించాలి."
-అనంత నారాయణ్​ జెనా, ఎమ్మెల్యే

ఇదీ చూడండి:శునకాలను చంపి.. రోడ్లపై కుప్పలుగా విసిరేశారు

Last Updated : Sep 29, 2019, 11:58 PM IST

ABOUT THE AUTHOR

...view details