తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చిన్నారి ఊపిరి తీసేసిన మాయదారి జెల్లీ - tamilnadu

పిల్లలకు నచ్చింది కొనుక్కొమ్మని డబ్బులిచ్చి పంపితే తెలిసీ తెలియనితనంతో నాణ్యతారహిత పదార్థాలు కొని ప్రాణాలు కోల్పోతున్నారు. అవును.. తమిళనాడులో ఓ నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలు తీసింది ఓ నాసి రకం జెల్లీ. గొంతులో ఇరుక్కుపోయి ఊపిరాడక మరణించాడు ఆ బాలుడు.

చిన్నారి ఊపిరి తీసేసిన మాయదారి జెల్లీ

By

Published : Aug 18, 2019, 8:09 PM IST

Updated : Sep 27, 2019, 10:43 AM IST

చిన్నారి ఊపిరి తీసేసిన మాయదారి జెల్లీ

తినుబండారాలతో ఆకర్షించి లాభాలు దండుకునే పరిశ్రమలు చిన్నారుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. కిరాణా దుకాణాలు తక్కువ పెట్టుబడితో ఎక్కువ సంపాదించాలనే తాపత్రయంతో నాణ్యత లేని పదార్థాలను పిల్లలకు విక్రయిస్తున్నాయి. తమిళనాడు పెరంబలూర్​ జిల్లా, అలాంబడి గ్రామంలో ఓ జెల్లీ చాక్లెట్​ నాలుగేళ్ల చిన్నారిని బలిగొంది.

రంగనాథన్​ ఓ నాలుగేళ్ల బాబు.. ఇంటి పక్కనే ఉన్న చిన్న కిరాణ దుకాణంలో జెల్లీ చాక్లెట్​ కొనుకున్నాడు. కలర్​ఫుల్​గా కనిపించేసరికి ఒకే సారి మింగే ప్రయత్నం చేశాడు. కానీ చిన్నారి చిన్ని ఆహార నాళంలోకి ఆ మాయదారి జెల్లీ జారలేదు.శ్వాసకోశాల్లోకి గాలి వెళ్లకుండా మూసివేసింది.ఊపిరాడక కాసేపు ఉక్కిరిబిక్కిరయ్యాడు. కొద్ది క్షణాలు ప్రాణాలతో పోరాడి ఆసుపత్రికి తీసుకువెళ్లేలోపే కన్ను మూశాడు. కళ్ల ముందే కన్న కొడుకు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం చూసి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు


బాలుడి మృతదేహాన్ని పంచనామాకు తరలించారు పోలీసులు.

ఇదీ చూడండి: 'నేతాజీ అదృశ్యమై 74ఏళ్లు... ఇంతకీ ఏమైంది?'

Last Updated : Sep 27, 2019, 10:43 AM IST

ABOUT THE AUTHOR

...view details