దేశంలో రోజూ నమోదవుతున్న కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. కొత్తగా 97,894 కేసులు వచ్చాయి. 1,132 మంది మరణించారు. మొత్తం బాధితుల సంఖ్య 51 లక్షల 18 వేలు దాటింది. ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం.
కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం సమర్థమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. అయితే రికవరీలూ అదే స్థాయిలో ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ చెబుతోంది. 40 లక్షల 25 వేలకు మందికిపైగా కోలుకున్నట్లు తెలిపింది. రికవరీ రేటు 78.64 శాతానికి పెరిగింది. మరణాలు రేటు 1.63 శాతానికి తగ్గింది.