తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆరు నెలల్లో 93మంది ఉగ్రవాదులు హతం

ఉగ్రవాదుల ఏరివేతలో భారత సైనికులు బిజీబిజీగా గడుపుతున్నారు. 6 నెలల్లోపే 93మంది ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది. వీరిలో పలువురు ముఖ్య ఉగ్ర నాయకులు కూడా ఉన్నారు.

By

Published : Jun 8, 2020, 3:45 PM IST

93 terrorists killed by security forces till June 8 in Jammu and Kashmir
ఆరు నెలల్లో 93మంది ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదుల ఏరివేతను భారత సైన్యం తీవ్రంగా పరిగణించింది. 6 నెలల కన్నా తక్కువ వ్యవధిలోనే 93మంది ముష్కరులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. వీరిలో పలువురు ముఖ్య నేతలు కూడా ఉన్నారు.

"జూన్​ 8 ఉదయం నాటికి.. జమ్ముకశ్మీర్​లో 93మంది ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. గత రెండు రోజుల్లో తొమ్మిది మంది ముష్కరులు మృతిచెందగా.. మన జవాన్లలో ఒక్కరు కూడా ప్రాణాలు వీడలేదు."

-- భారత సైన్యం.

కశ్మీర్​లో ఉగ్రవాద బృందాల ఏరివేత, నియంత్రణ రేఖ వెంబడి అక్రమ చొరబాట్లను అడ్డుకునే కార్యకలాపాలు ముమ్మరంగా జరుగుతున్నాయి.

టాప్​ ఉగ్ర నేతలు రియాజ్​ నైకూ, జునైద్​ సెహ్రాయ్​ సహా జైషే మహ్మద్​, లష్కరే తోయిబా, పాకిస్థాన్​ రూపొందించిన రెసిస్టెన్స్​ ఫోర్స్​లోని అనేక మంది విదేశీ ఉగ్రవాదులను భారత సైన్యం హతమార్చింది.

మన జవాన్లు కూడా..

గత నెలలో కేరన్​ సెక్టార్​లోకి ఐదుగురు ముష్కరులు చొరబడ్డారు. వారిని మట్టుబెట్టే క్రమంలో ఐదుగురు పారా ఎస్​ఎఫ్​ సైనికులు అమరులయ్యారు.

అదే నెలలో హంద్వారాలో జరిగిన ఎన్​కౌంటర్​లో కల్నల్​ సహా ముగ్గురు ఆర్మీ సిబ్బంది తుది శ్వాస విడిచారు.

అయితే గత కొన్ని ఆపరేషన్లలో మన జవాన్లకు ఎలాంటి గాయాలవ్వలేదు.. సురక్షితంగా పని పూర్తి చేశారు.

రానున్న రోజుల్లో మంచు కరిగే అవకాశమున్న నేపథ్యంలో కశ్మీర్​లోకి చొరబడేందుకు ఉగ్రవాదులు సన్నద్ధమవుతుంటారు. ఫలితంగా ఎన్​కౌంటర్ల సంఖ్య పెరిగే అవకాశముంది.

ABOUT THE AUTHOR

...view details