తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 9మంది మృతి - road accident in rajasthan bhirwala district

రాజస్థాన్​లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ జీపు బస్సును ఢీ కొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 9మంది మరణించారు. 11మంది గాయపడ్డారు.

raj acc
రోడ్డు ప్రమాదం... ఒకే కుటుంబానికి చెందిన 9మంది మృతి

By

Published : Feb 11, 2020, 2:23 PM IST

Updated : Feb 29, 2020, 11:48 PM IST


‍రాజస్థాన్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది ప్రాణాలు కోల్పోయారు.

జీపు, బస్సు ఢీ

భిల్వారా జిల్లాలోని పవన్‌ ధామ్‌ వద్ద జీపు... బస్సును ఢీ కొనడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రోడ్డుపై ఉన్న అయిదుగురు సహా 11 మంది గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు.

ప్రమాదంపై రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు తగిన చికిత్స అందించేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

రోడ్డు ప్రమాదం... ఒకే కుటుంబానికి చెందిన 9మంది మృతి

ఇదీ చూడండి: ఆప్​ కీ దిల్లీ:​ హ్యాట్రిక్​ దిశగా కేజ్రీ.. మళ్లీ ప్రభంజనం!

Last Updated : Feb 29, 2020, 11:48 PM IST

ABOUT THE AUTHOR

...view details