తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సర్కారు బాధ్యతను గుర్తు చేసిన ఎనిమిదేళ్ల చిన్నారి! - lisipriya environment latest newsnews

అమ్మ, నాన్న, ఇల్లు, బడి తప్పా ఏమీ తెలియని వయస్సు ఆమెది .. కానీ ప్రపంచ వేదికపై భవిష్యత్తును కాంక్షించింది. పర్యావరణ పరిరక్షణకు పాటు పడుతూ వేలాది మందిని సంఘటితం చేస్తోంది. భవిష్యత్​ తరాలను కాపాడుకోవడంలో భారత సర్కార్ బాధ్యతను గుర్తు చేసిన ఎనిమిదేళ్ల లిసిప్రియ కంజుగం.. ఐక్యరాజ్యసమితి వేదికగా తన గళాన్ని వినిపించింది.

8year old kid speak in united nations
ఎనిమిదేళ్లకే ఐరాసకెక్కింది

By

Published : Dec 13, 2019, 1:25 PM IST


మా భవిష్యత్తును కోల్పోవడం అంటే ఎన్నికల్లో ... స్టాక్‌ మార్కెట్‌లో.. సంఖ్యలు తగ్గిపోవడంలాంటిది కాదు. మీరు కన్నబిడ్డలం మేం. మమ్మల్ని ఎటువంటి ప్రపంచంలో పెంచాలో మీరే నిర్ణయించండి. భారత ప్రభుత్వానికి నేను చేసే డిమాండ్‌లు మూడు. 'జీరో కార్బన్‌ విడుదలకు వాతావరణ చట్టం తీసుకురావాలి, 'వాతావరణ మార్పులు' పేరుతో పాఠ్యాంశాలు చేర్చాలి, ప్రతి విద్యార్థి ఏటా మొక్కలను నాటేలా ప్రోత్సహిస్తూ, పెంచిన వృక్షాల ఆధారంగా డిగ్రీ ఇవ్వాలి'. భూగోళ పరిస్థితిని మెరుగుపరచడమే నా జీవితధ్యేయం. భవిష్యత్తులో అంతరిక్ష శాస్త్రవేత్తనవుతా. ఎందుకంటే... త్వరలో మనం నివసించే ఈ భూమి అంతరించనుంది. ఆ తరువాత మనం జీవించడానికి స్థలం కనుక్కోవడం కోసమే. చంద్రుడు, మార్స్‌ గ్రహాలపైకి రాకెట్‌ను పంపి, అక్కడ జీవించడం వీలవుతుందా లేదా అని తెలుసుకుంటా...

ఈ మాటలన్నది ఎవరోకాదు, ఏడేళ్లప్పుడే పర్యావరణ కార్యకర్తగా మారిన మణిపూర్‌కు చెందిన అతిచిన్న వయస్కురాలు ఎనిమిదేళ్ల లిసిప్రియ కంజుగం. వాతావరణాన్ని మార్చే చట్టాన్ని తెమ్మంటూ గతేడాది పార్లమెంటు ఎదుట పోరాటం చేసింది. దిల్లీలో 'ఇండియా గేట్‌ వద్ద 'గ్రేట్‌ అక్టోబరు మార్చ్‌'పేరుతో వేలాదిమంది మద్దతుదారులను కలుపుకొని ఏడు రోజులపాటు మార్చ్‌ చేసింది. విపత్తు నిర్వహణపై మన దేశం తరఫున ప్రతినిధిగా జెనీవాలో జరిగిన ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో ప్రసంగించింది. ఇందులో 140 దేశాలకు చెందిన మూడు వేలమంది ప్రతినిధులు హాజరవడం విశేషం. ప్రస్తుతం 'ఇంటర్నేషనల్‌ యూత్‌ కమిటీలో ఛైల్డ్‌ డిజాస్టర్‌ రిస్క్‌ రిడక్షన్‌'కు న్యాయవాదిగా ఉంది. ఇప్పటికే 'వరల్డ్‌ చిల్డ్రన్స్‌ పీస్‌ ప్రైజ్‌', 'ద ఇండియా పీస్‌ ప్రైజ్‌', 'డాక్టర్‌ ఏపీజె అబ్దుల్‌ కలాం చిల్డ్రన్స్‌ అవార్డు'లను అందుకుంది.

ఇబ్బందులెన్నెదురైనా...

విదేశాల్లో నిర్వహించే సదస్సులకు ఓ వైపు క్రౌడ్‌ ఫండ్‌ సహాయం అందినా కూడా, లిసిప్రియకు ఆమె తల్లిదండ్రుల సహకారం పూర్తిగా ఉంది. దిగువ మధ్యతరగతి కుటుంబం కావడంతో లిసిప్రియ పోరాటానికి వారు ఓ వైపు మద్దతునిస్తున్నా.. మరోవైపు వారిపై పడుతున్న ఆర్థిక భారాన్నీ మోస్తున్నారు. ఐక్యరాజ్యసమితి సమావేశాలకు వెళ్లేటప్పుడు అక్కడ ఉండటానికి లిసిప్రియ తల్లి తన బంగారపు గొలుసును విక్రయించి మరీ హోటల్‌ సౌకర్యాన్ని అందించింది.

పర్యావరణ పరిరక్షణ కోసం పోరాడుతున్న లిసిప్రియకు చదువుకునే తీరిక ఉండటం లేదు. స్కూల్‌కు వెళ్ళాలి, తోటి పిల్లలతో కలిసి ఆడుకోవాలి అని ఉంటుంది. కానీ సమయం లేదు. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో స్కూల్‌ మానేసింది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను చూస్తే... నా మనసు ద్రవించిపోతుంది. దీనికంతా కారణం పర్యావరణ కాలుష్యమే. దీనిని నాయకులు గుర్తించాల్సిన అవసరం ఉంది' అని చెప్పే లిసిప్రియను పర్యావరణ కార్యకర్తగా ప్రపంచమంతా పేరొందిన గ్రేటా తంబర్గ్‌తో పోల్చడం విశేషం. ఈమెను 'గ్రేటా ఆఫ్‌ ద గ్లోబల్‌ సౌత్‌'గా పిలుస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details