తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో 43 లక్షలు దాటిన కరోనా కేసులు - #covid-19

దేశంలో కరోనా విస్తరణ కొనసాగుతోంది. కొత్తగా 89,706 మంది వైరస్​ బారిన పడ్డారు. మరో 1,115 మృతి చెందారు.

89,706 coronavirus new cases and 1,115 deaths in India
దేశంలో ఒక్కరోజే 89,706 కేసులు.. 1,115 మరణాలు

By

Published : Sep 9, 2020, 9:51 AM IST

Updated : Sep 9, 2020, 11:12 AM IST

భారత్​లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. మృతుల సంఖ్యలో మాత్రం ఏ మార్పు లేదు. తాజాగా 89,706 కేసులు నమోదయ్యాయి. మరో 1,115 మంది మృత్యువాత పడ్డారు. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 43 లక్షల 70 వేలు దాటింది.

దేశంలో 43 లక్షలు దాటిన కరోనా కేసులు

తగ్గుతున్న మరణాల రేటు..

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ.. రికవరీ రేటు కూడా పెరుగుతున్నట్లు కనిపిస్తుంది. ఇప్పటివరకు దాదాపు 34 లక్షల (33,98,844)మంది మహమ్మారి నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. దీంతో రికవరీ రేటు 77.77శాతానికి పెరిగింది. మరణాల రేటు క్రమంగా క్షీణంచి... 1.69కు చేరినట్లు అధికారులు పేర్కొన్నారు.

రాష్ట్రాల వారిగా కొవిడ్​ కేసుల వివరాలు

భారీగా టెస్టులు

కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా వైరస్​ నిర్ధరణ పరీక్షలను పెంచుతున్నారు అధికారులు. మంగళవారం ఒక్కరోజే 11 లక్షల 54 వేల 549 నమూనాలు పరీక్షించినట్లు ఐసీఎంఆర్​ తెలిపింది. దీంతో మొత్తం టెస్టుల సంఖ్య 5 కోట్ల 18 లక్షల 4 వేల 677కు పెరిగింది.

ఏ రాష్ట్రంలో ఎన్ని కేసులు..!

ఇదీ చూడండి:తొమ్మిది సార్లు ప్లాస్మాదానం చేసి అందరికీ ఆదర్శంగా!

Last Updated : Sep 9, 2020, 11:12 AM IST

ABOUT THE AUTHOR

...view details