గుజరాత్పై వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అనేక ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
ఒకే రోజులో రెండు...
భారీ వర్షాలకు నదైడ్ పట్టణంలో శుక్రవారం అర్ధరాత్రి మూడంతస్తుల భవనం కూలింది. ఈ ఘటనలో ఒక చిన్నారి సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో అయిదుగురు గాయాలతో బయటపడ్డారు.
శనివారం మధ్యాహ్నం మోర్బిలోని ఉమియా కూడలి వద్ద గోడ కూలింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు చిన్నారులు సహా 8 మంది మరణించారు. కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలే గోడ కూలేందుకు కారణమని తెలుస్తోంది. ఘటనాస్థలాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు.