తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పసందైన కేకుల్లో.. ప్రపంచంలోని ఏడు వింతలు..! - పసందైన కేకుల్లో.. ప్రపంచంలోని ఏడు వింతలు..!

ఈ సారి క్రిస్​మస్​, న్యూఇయర్ పండుగలకు తాజ్​మహల్​ కట్​ చేస్తారా? పిరమిడ్​ కట్​ చేస్తారా? అదేంటీ, కట్టడాలను కట్​ చేయడమేంటనుకుంటున్నారా? అవును ఈ సారి కట్టడాలను కట్​ చేసి సంబరాలు చేసుకోవచ్చు..  ఎందుకంటే, కర్ణాటకలోని ఓ బేకరీ వారు ప్రపంచంలోని ఏడు వింతల కేకులను తయారు చేశారు మరి!

7 wonders of the world created in cake at Mysore
పసందైన కేకుల్లో.. ప్రపంచంలోని ఏడు వింతలు..!

By

Published : Dec 24, 2019, 9:36 AM IST

Updated : Dec 24, 2019, 4:06 PM IST

పసందైన కేకుల్లో.. ప్రపంచంలోని ఏడు వింతలు..!

కర్ణాటక సాంస్కృతిక నగరం మైసూర్​లో ప్రపంచ అద్భుతాలన్నీ ఒకే చోట కనువిందు చేస్తున్నాయి. క్రిస్​మస్​, న్యూ ఇయర్ సందర్భంగా కేకుతోనే​​ ప్రపంచంలోని ఏడు వింతలను తయారు చేశారు డాల్ఫిన్​ బేకర్స్​.

సృజనాత్మకత జోడించి ప్రపంచ వింతలతో అందంగా తయారు చేసిన కేకులు.. అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. తాజ్​మహల్​, గ్రేట్ వాల్ ఆఫ్​ చైనా, జోర్డాన్​లోని​ పెట్రా, ఈజిప్టులోని చించెన్​ ఇట్జా పిరమిడ్​, పెరూలోని మాచుపిచ్చూ, బ్రెజిల్​లోని క్రీస్ట్​ ద రిడీమర్​, ఇటలీలోని కొలొజియం అన్నింటినీ ఒకే చోట కేకులతో సృష్టించేశారు.

మైసూర్​ మహారాజా కళాశాల మైదానంలో ఇవి తయారు చేసి ప్రదర్శనకు పెట్టారు. వీటిని చూసేందుకు జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. అయితే, ఇవి కేవలం ప్రదర్శించడం కోసం మాత్రమే.. అనేక రసాయనిక రంగులు వాడి తయారు చేశారు కాబట్టి ఇవి తినేందుకు పనికిరావంటున్నారు నిర్వాహకులు.

ఇదీ చదవండి:న్యూఇయర్​కు క్రిస్మస్ గ్రీటింగ్ కార్డు ఇచ్చిన సునీల్!

Last Updated : Dec 24, 2019, 4:06 PM IST

ABOUT THE AUTHOR

...view details