తెలంగాణ

telangana

ETV Bharat / bharat

స్పీడు పెంచిన కరోనా- 'మహా'లో కొత్తగా 6,555 కేసులు - corona latest toll

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. మహారాష్ట్రలో వైరస్ తీవ్రరూపం దాల్చింది. ఇవాళ రికార్డు స్థాయిలో 6,555 కేసులు నమోదయ్యాయి. తమిళనాడు, దిల్లీ సహా ఇతర రాష్ట్రాల్లో వైరస్​ వేగంగా విస్తరిస్తోంది.

COVID-19 cases
'మహా'లో ఆగని కరోనా ఉద్ధృతి

By

Published : Jul 5, 2020, 9:21 PM IST

Updated : Jul 5, 2020, 9:56 PM IST

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్యలో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే 6,555 మందికి వైరస్​ పాజిటివ్​గా తేలింది. మరో 151 మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్​ నుంచి నేడు 3,658 మంది కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 2,06,619కి చేరింది. మరణాలు 8,822కు చేరగా.. ఇప్పటివరకు 1,11,740 మంది వైరస్​ బారి నుంచి బయటపడ్డారు.

తమిళనాడులో...

తమిళనాడులో కొవిడ్​-19​ పంజా విసురుతోంది. కొద్ది రోజులుగా రోజుకు నాలుగువేలకుపైగా కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇవాళ 4,150 మందికి కొత్తగా వైరస్​ పాజిటివ్​గా తేలింది. మరో 60 మంది ప్రాణాలు కోల్పోయారు.

దిల్లీలో...

దిల్లీలో ఇవాళ మరో 2,505 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య లక్షకు చేరువైంది. మరణాలు సంఖ్య 3,067కు చేరింది. ఇవాళ 63 మంది ప్రాణాలు కోల్పోయారు.

బంగాల్​లో..

బంగాల్​లో కరోనా వైరస్​ వేగంగా వ్యాపిస్తోంది. ఇవాళ రికార్డు స్థాయిలో 895 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజు నమోదైన కేసుల సంఖ్యలో ఇదే అత్యధికం. ఈరోజు 21 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 22,126కు మరణాలు 757కు చేరాయి.

వైరస్​ ప్రభావం తక్కువగా ఉన్న ఈశాన్య రాష్ట్రాల్లోనూ విస్తరిస్తోంది ఈ మహమ్మారి. అరుణాచల్​ప్రదేశ్​లో ఇవాళ 7, పుదుచ్చేరిలో 43, నాగాలాండ్​లో 28 కొత్త కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రం కొత్త కేసులు మరణాలు మొత్తం కేసులు మొత్తం మరణాలు
మహారాష్ట్ర 6,555 151 2,06,619 8,822
తమిళనాడు 4,150 60 1,11,151 1,510
దిల్లీ 2,505 63 99,444 3,067
కర్ణాటక 1,925 37 23,474 372
బంగాల్ 895 21 22,126 757
గుజరాత్​ 725 18 36,123 1,945
యూపీ 1,153 12 27,707 785
కేరళ 225 - 5204 25
ఎంపీ 326 10 14,930 608
Last Updated : Jul 5, 2020, 9:56 PM IST

ABOUT THE AUTHOR

...view details