పాక్ చెర నుంచి విముక్తి పొంది 18 ఏళ్ల తర్వాత భారత్ చేరిన వృద్ధురాలు హసీనా బేగమ్ గుండె పోటుతో మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో చనిపోయింది. ఆమె తిరిగొచ్చిందన్న ఆనందం కుటుంబ సభ్యులకు ఎంతోకాలం నిలువలేదు.
అసలు ఏం జరిగింది..?
మహారాష్ట్రలోని ఔరంగబాద్కు చెందిన 65 ఏళ్ల హసీనా బేగమ్ 18 ఏళ్ల క్రితం ఆమె భర్త బంధువులను కలుసుకునేందుకు పాకిస్థాన్కు వెళ్లింది. లాహోర్లో ఆమె పాస్పోర్ట్ పోగొట్టుకుంది. పాస్పోర్ట్ లేని కారణంగా హసీనాకు పాకిస్థాన్ జైలు శిక్ష విధించింది.