దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తుది పోలింగ్ శాతాన్ని ప్రకటించింది ఎన్నికల సంఘం(ఈసీ). దేశ రాజధానిలోని మొత్తం 70 స్థానాల్లో 62.59 శాతం పోలింగ్ నమోదైనట్లు దిల్లీ ఎన్నికల ప్రధానాధాకారి రణ్బీర్ సింగ్ స్పష్టం చేశారు. అత్యధికంగా బల్లీమారాం నియోజకవర్గంలో 71.6 శాతం.. దిల్లీ కంటోన్మెంట్లో అత్యల్పంగా 45.04 శాతం పోలింగ్ నమోదైనట్లు వెల్లడించారు.
దిల్లీ దంగల్: 62.59శాతం పోలింగ్ నమోదు
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 62.59శాతం పోలింగ్ నమోదైనట్లు దిల్లీ ఎన్నికల ప్రధానాధికారి రణ్బీర్ సింగ్ ప్రకటించారు. తుది పోలింగ్ శాతాన్ని ప్రకటించకపోవడంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో.. జాప్యానికి గల కారణాలను కూడా వెల్లడించారు రణ్బీర్.
పోలింగ్ ముగిసి గంటలు గడుస్తున్నా ఓటింగ్ శాతాన్ని వెల్లడించకపోవడంపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తాజాగా ఈసీ అధికారులను ప్రశ్నించారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించిన అధికారులు.. జాప్యానికి గల కారణాలతో పాటు నియోజకవర్గాల వారీగా ఓటింగ్ శాతాన్ని ప్రకటించారు.
4.88శాతం తగ్గుదల..
లోక్సభ ఎన్నికల కంటే అసెంబ్లీ పోరులో 2శాతం మంది అధికంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు వెల్లడించారు రణ్బీర్. అయితే 2015లో జరిగిన ఎన్నికలతో పోల్చితే ఇప్పుడు 4.88శాతం పోలింగ్ తగ్గినట్లు పేర్కొన్నారు.
TAGGED:
delhi polls turnout