తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భూకంపం దాటికి గజగజ వణికిన ఉత్తర భారతం - ఉత్తర భారతంలో భూకంప తీవ్రత

భారత్​-పాక్ సరిహద్దుల్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్​ స్కేలుపై తీవ్రత 6.3గా నమోదైంది. దీని ప్రభావం దిల్లీ, పంజాబ్​, హరియాణా, హిమాచల్​ప్రదేశ్​, రాజస్థాన్​లో కనిపించింది. అయితే ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరుగలేదని అధికారులు చెబుతున్నారు.

భూకంపం దాటికి గజగజ వణికిన ఉత్తర భారతం

By

Published : Sep 24, 2019, 7:50 PM IST

Updated : Oct 1, 2019, 9:02 PM IST

భారత్​-పాక్ సరిహద్దుల్లో భారీ భూకంపం సంభవించింది. ఉత్తర భారత దేశంలోని దిల్లీ,​ పంజాబ్​, హరియాణాలోనూ భూమి కంపించింది. రిక్టర్​ స్కేలుపై తీవ్రత 6.3గా నమోదైందని జాతీయ భూకంప విజ్ఞాన కేంద్రం వెల్లడించింది.

భూకంపం వల్ల ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగలేదని అధికారులు తెలిపారు.

"భూకంప కేంద్రం భారత్​-పాక్ సరిహద్దుకు సమీపంలో ఉంది. దీనికి దగ్గరగా ఉన్న నగరం రావల్పిండి ( పాకిస్థాన్​ పంజాబ్ రాష్ట్రం​)"
- గౌతమ్​, ఎన్​సీఎస్​ కార్యనిర్వణాధికారి

గజగజ వణికారు..

భూ ప్రకంపనలకు భయపడి జమ్ము కశ్మీర్​, పంజాబ్, హరియాణా, హిమాచల్​ప్రదేశ్, రాజస్థాన్​ ​ప్రజలు ఇళ్లు, కార్యాలయాలు వదిలి వీధుల్లోకి పరుగులు తీశారు.

పర్వత నగరంలో భూకంపం

పాకిస్థానీ పంజాబ్​లోని పర్వత నగరమైన జెహ్లం సమీపంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.8గా నమోదైందని పాక్ వాతావరణశాఖ తెలిపింది. అయితే పాక్ విజ్ఞాన శాస్త్ర మంత్రి ఫవాద్​ చౌదరి మాత్రం భూకంప తీవ్రత 7.1గా ఉందని ప్రకటించారు.

ఇదీ చూడండి: పాక్​లో​ భూకంపం - ఇద్దరు మృతి, 100 మందికి గాయాలు


Last Updated : Oct 1, 2019, 9:02 PM IST

ABOUT THE AUTHOR

...view details