తెలంగాణ

telangana

By

Published : Dec 15, 2020, 7:13 AM IST

ETV Bharat / bharat

సమస్యల పరిష్కారానికి ఎయిమ్స్​ నర్సుల నిరవధిక సమ్మె

సుమారు 5వేల మంది ఆల్​ ఇండియా ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ మెడికల్​ అండ్​ సైన్స్​(ఎయిమ్స్​)లో పని చేసే నర్సులు సమ్మెకు దిగారు. సమస్యల పరిష్కారంతో పాటు ఒప్పంద ఉద్యోగ నియామకాలకు వ్యతిరేకంగా నిరవధిక సమ్మెకు దిగారు.

5000 aims nurses go on indefinite strike over redressal of demands urges them to resume work
సమ్మెకు దిగిన 5 వేల మంది ఎయిమ్స్​ నర్సులు!

దిల్లీలోని ఆల్ ఇండియా ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ మెడికల్​ అండ్​ సైన్స్​(ఎయిమ్స్​)లో పని చేసే సుమారు 5వేల మంది నర్సులు నిరవధిక సమ్మెకు దిగారు. తమ డిమాండ్లను నెరవేర్చడంలో యాజమాన్యం విఫలమైందని ఆరోపించారు. కేంద్ర ఆరోవ వేతన సంఘం సూచనలను తక్షణమే​ అమలు చేయాలని కోరారు. ఒప్పంద నియామకాలకు వ్యతిరేకంగా సమ్మెకు దిగినట్లు తెలిపారు.

"ఆరు నెలలుగా మా డిమాండ్లను పరిగణలోకి తీసుకోవాలి అని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించాం. కానీ వారు మా డిమాండ్లను తిరస్కరించారు. గతేడాది జరిగిన సమావేశంలో కేంద్రమంత్రి హర్షవర్థన్​ సూచన ప్రాయంగా అంగీకారం తెలిపారు. కానీ ఫలితం కనిపించడం లేదు. ప్రభుత్వ తీరు చాలా బాధాకరం. అందుకే సమ్మెకు దిగుతున్నాం."

-హరీశ్​ కజ్లా, ఎయిమ్స్​ నర్సుల యూనియన్​ అధ్యక్షులు

ఇదిలా ఉంటే మెడికల్ సిబ్బంది వెంటనే సమ్మెను విరమించుకొని తిరిగి విధుల్లోకి రావాలని విజ్ఞప్తి చేశారు ఎయిమ్స్​ డైరెక్టర్​ డాక్టర్​ రణదీప్​ గులేరియా. చేసే వృత్తిపట్ల నిబద్ధత ఉన్న వారు రోగులను వదిలి పెట్టి సమ్మెకు దిగరని అన్నారు.

ఇదీ చూడండి: వారికి గౌరవార్థంగా బీఎస్​ఎఫ్​ జవాన్ల 'పరుగు'

ABOUT THE AUTHOR

...view details