తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జాతీయ పార్కులో పిట్టల్లా రాలిన వన్యప్రాణులు - Kaziranga

అసోం వరదలు వన్యప్రాణులకు శాపంగా మారాయి. కాజీరంగా జాతీయ పార్కు సగానికిపైగా నీటమునిగింది. వరదల కారణంగా ఇప్పటి వరకు 208 మూగ జీవాలు ప్రాణాలు కోల్పోయాయి.

జాతీయ పార్కులో పిట్టల్లా రాలిన వన్యప్రాణులు

By

Published : Jul 25, 2019, 9:28 PM IST

Updated : Jul 25, 2019, 10:38 PM IST

భారీ వరదలు అసోంను ముంచెత్తుతున్నాయి. రాష్ట్రంలో ఉన్న ప్రఖ్యాత కాజీరంగా జాతీయ పార్కు సగానికిపైగా వరద నీటిలో మునిగింది. వరదలను తప్పించుకునేందు పార్కు నుంచి బయటికి వచ్చి కొన్ని వన్య జీవాలు మృతి చెందగా.. మరికొన్ని వరదల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాయి.

మూగ జీవాలను రక్షించేందుకు అధికారులు ఎత్తయిన ప్రాంతాలకు తరలించారు. అయితే వాటికి ఆహారం పెద్ద సమస్యగా మారింది. కొన్ని వన్య మృగాలు ఆహారం కోసం జనావాసాల్లోకి వస్తున్నాయి. ఆహార కొరత, మురుగు నీరు కారణంగా అటవీ మృగాలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నాయి.

ఇప్పటి వరకు వరదల కారణంగా 208 వన్య ప్రాణులు మృత్యువాత పడ్డాయి. వీటిలో 18 ఖడ్గమృగాలు, 167 జింకలు, ఒక ఏనుగు, 18 అడవి పందులు ఉన్నాయి.

ఇదీ చూడండి: పార్లమెంట్​ సమావేశాలు ఆగస్టు 7 వరకు పొడిగింపు

Last Updated : Jul 25, 2019, 10:38 PM IST

ABOUT THE AUTHOR

...view details