తెలంగాణ

telangana

By

Published : Nov 18, 2019, 8:18 PM IST

Updated : Nov 18, 2019, 11:20 PM IST

ETV Bharat / bharat

3 నెలల్లో 950 సార్లు పాక్​ కవ్వింపు చర్యలు

ఆగస్టు-అక్టోబరు మధ్య నియంత్రణ రేఖ వద్ద పాక్ సైన్యం 950 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్రం ఈ వివరాలు వెల్లడించింది.

3 నెలల్లో 950 సార్లు పాక్​ కవ్వింపు చర్యలు

3 నెలల్లో 950 సార్లు పాక్​ కవ్వింపు చర్యలు

ఆగస్టు-అక్టోబర్​ మధ్య పాకిస్థాన్​ సైన్యం 950 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని కేంద్రం వెల్లడించింది. పొరుగు దేశ సైన్యం దాడిలో ముగ్గురు భారతీయ జవాన్లు అమరులైనట్లు తెలిపింది. రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలు వెల్లడించారు రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్.

"పాక్​ నియంత్రణరేఖ వద్ద 950సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ము ప్రాంతంలో అంతర్జాతీయ సరిహద్దు వద్ద 75 సార్లు కాల్పులు జరిపింది. ఈ మూడు నెలల్లో ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. మరో ఏడుగురు గాయపడ్డారు. పాకిస్థాన్​ కవ్వింపు చర్యలకు పాల్పడినప్పుడల్లా భారత సైన్యం దీటుగా సమాధానం ఇస్తూనే వస్తుంది. ఈ అంశాన్ని పలుసార్లు పాక్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం."

-శ్రీపాద్​ నాయక్​, రక్షణ శాఖ సహాయ మంత్రి

పాక్​ నుంచి ఉగ్రవాదుల చొరబాట్లను అరికట్టేందుకు సాంకేతికత సాయంతో పటిష్ఠ వ్యూహం అమలు చేస్తున్నట్లు తెలిపారు నాయక్.

ఇదీ చూడండి : ఆర్థిక మాంద్యమా? అదెక్కడ?... విపక్షానికి కేంద్రం ప్రశ్న

Last Updated : Nov 18, 2019, 11:20 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details