తెలంగాణ

telangana

By

Published : Oct 1, 2019, 5:15 AM IST

Updated : Oct 2, 2019, 5:01 PM IST

ETV Bharat / bharat

'కశ్మీర్'​పై నేటి నుంచి రాజ్యాంగ ధర్మాసనం విచారణ

జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ 370 రద్దుపై దాఖలైన పలు వ్యాజ్యాలపై ఐదుగురు సభ్యుల ధర్మాసనం నేటి నుంచి విచారణ జరపనుంది. ఆర్టికల్​ 370 రద్దు అనంతరం పలు సమస్యలపై దాఖలైన పిటిషన్లను త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపడుతుందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయి తెలిపారు.

'కశ్మీర్'​పై నేటి నుంచి రాజ్యాంగ ధర్మాసనం విచారణ

'కశ్మీర్'​పై నేటి నుంచి రాజ్యాంగ ధర్మాసనం విచారణ1

ఆర్టికల్​ 370 రద్దు నేపథ్యంలో జమ్ముకశ్మీర్​కు సంబంధించి దాఖలైన వేర్వేరు వ్యాజ్యాలను రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగించింది సుప్రీం కోర్టు. ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చెల్లుబాటు, రాష్ట్రపతి ఉత్తర్వులను సవాల్​ చేస్తూ దాఖలైన పిటిషన్లపై నేటి నుంచి విచారణ చేపట్టనుంది ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం.

ఆర్టికల్​ 370పై దాఖలైన పిటిషన్లను పెద్ద ధర్మాసనానికి బదిలీ చేస్తామని ఈనెల 28న సుప్రీం తెలిపింది. ఈ మేరకు జస్టిస్​ ఎన్వీ రమణ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది సుప్రీం కోర్టు. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుభాష్ రెడ్డి, జస్టిస్​ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ ఇందులో సభ్యులుగా ఉన్నారు.

త్రిసభ్య ధర్మాసనం..

ఆర్టికల్​ 370 రద్దు అనంతరం చెలరేగిన సమస్యలకు సంబంధించిన పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఇలాంటి వ్యాజ్యాలన్నింటినీ జస్టిస్​ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపడుతుందని స్పష్టం చేసింది.

కశ్మీర్​ లోయలో మైనర్లను అక్రమంగా అదుపులోకి తీసుకుంటున్నారన్న ఆరోపణలపై జమ్ముకశ్మీర్​ హైకోర్టుకు చెందిన జువెనైల్​ జస్టిస్​ కమిటీ నివేదిక అందినట్లు తెలిపింది. నివేదికను త్రిసభ్య ధర్మాసనానికి పంపనున్నట్లు పిటిషనర్ల తరఫు న్యాయవాదులు, పిల్లల హక్కుల కార్యకర్తలు ఎనాక్షి గంగూలి, శాంత సిన్హాలకు తెలియజేసింది ధర్మాసనం.

కశ్మీర్​లో ఆంక్షల నేపథ్యంలో మందులు, వైద్య సౌకర్యాలు అందటం లేదని ఓ వైద్యుడు దాఖలు చేసిన వ్యాజ్యం, కశ్మీర్​ టైమ్స్​ ఎడిటర్​ అనురాధ భాసిన్​ పిటిషన్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ, సీనియర్​ కాంగ్రెస్​ నాయకుడు గులామ్​ నబీ ఆజాద్​ వ్యాజ్యం​పైనా త్రిసభ్య ధర్మాసనమే విచారణ చేపడుతుందని స్పష్టం చేసింది.

కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా..

ఆర్టికల్​ 370 రద్దు, రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. మొదటిగా న్యాయవాది ఎంఎల్​ శర్మ ఆర్టికల్​ 370 రద్దుపై రాష్ట్రపతి ఉత్తర్వులను సవాల్​ చేశారు. అనంతరం రాజకీయ పార్టీలు నేషనల్​ కాన్ఫరెన్స్​, జమ్ముకశ్మీర్ పీపుల్స్​ కాన్ఫరెన్స్​, సీపీఎం పిటిషన్లు దాఖలు చేశాయి. వారితో పాటు మాజీ రక్షణ శాఖ అధికారులు, ప్రతినిధులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

ఇదీ చూడండి: మృత్యువును ప్రేమించిన జగత్​ప్రేమికుడు... మహాత్ముడు

Last Updated : Oct 2, 2019, 5:01 PM IST

ABOUT THE AUTHOR

...view details