తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేవుడి దర్శనం కోసం వెళ్తూ ఐదుగురు మృతి

తమిళనాడులోని తిరువన్నమలైలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పారిశ్రామికవేత్త శ్రీనాథ్​ కుటుంబం మృతిచెందింది. వారి వాహనం ఒక లారీని ఢీకొనగా ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

By

Published : Aug 13, 2019, 4:30 PM IST

Updated : Sep 26, 2019, 9:19 PM IST

దేవుడు దర్శనం కోసం వెళ్తు అయిదుగురు మృతి

రోడ్డు ప్రమాదం అనంతరం దృశ్యాలు

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరువన్నమలై పట్టణంలో లారీ- కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పారిశ్రామికవేత్త శ్రీనాథ్​ రెడ్డితో పాటు అతడి​ భార్య షాలిని, కుమారుడు భరత్​, అల్లుడు సందీప్​ సహా మొత్తం ఐదుగురు​ ఘటనాస్థలంలోనే మరణించారు. వీరందరూ అన్నమలైయర్​ దర్శనానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
ఈ రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్​ తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు.

Last Updated : Sep 26, 2019, 9:19 PM IST

ABOUT THE AUTHOR

...view details