తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'4 వేల 800 మెడికల్​ సీట్లు పేదలకే...'

4,800 మంది ఆర్థికంగా వెనకబడిన విద్యార్థులకు ఈ ఏడాది ఎమ్​బీబీఎస్​లో​ సీట్లు కేటాయించినట్టు ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్​ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలల్లో సీట్లు పెంచడానికి తగిన చర్యలు చేపడుతున్నట్టు వివరించారు.

By

Published : Jul 12, 2019, 7:47 PM IST

'వైద్య కళాశాలల్లో సీట్ల పెంపునకు కేంద్రం చర్యలు'

వైద్య కళాశాలల్లో అండర్​ గ్రాడ్యుయేట్​, పోస్ట్​ గ్రాడ్యూయేట్​ కోర్సులకు సంబంధించి... రెండేళ్లలో 24,698 సీట్లు పెరిగాయని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్​ లోక్​సభలో తెలిపారు. ఆర్థికంగా వెనకబడిన విద్యార్థులకు ఈ ఏడాది నీట్​లో 4,800 సీట్లు కేటాయించామని వివరించారు.

లోక్​సభలో ఆరోగ్యమంత్రి

"ఈ ఒక్క ఏడాదిలోనే నీట్​కు చెందిన సుమారు 4వేల 800 మెడికల్​ సీట్లు ఆర్థికంగా వెనకబడిన విద్యార్థుల కోసం కేటాయించాం. కొన్ని నెలల వ్యవధిలోనే నీట్​లో 15 వేల సీట్లు పెరిగాయి. ఇప్పుడు నీట్​లో సీట్ల సంఖ్య 75వేలకు చేరుకుంది. ఇది ఒక రికార్డు."
-హర్షవర్ధన్​, ఆరోగ్యశాఖ మంత్రి.

దేశవ్యాప్తంగా ఉన్న వైద్య సంస్థలు, కళాశాలల్లో సీట్లు పెంచడానికి మోదీ ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందని హర్షవర్ధన్​ తెలిపారు. ఎమ్​బీబీఎస్​ కోర్సు గుర్తింపు పొందిన మూడేళ్లలోనే పీజీ కోర్సులనూ కచ్చితంగా ప్రారంభించాలని అన్ని వైద్య కళాశాలను ఆదేశించినట్టు వివరించారు. కేంద్ర ప్రభుత్వ ఆధారిత పథకం ద్వారా దేశంలో 82 కొత్త కళాశాలలను ఏర్పాటు చేస్తున్నట్టు లోక్​సభలో మరో ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం సమర్పించారు. ఈ పథకం కింద 60శాతం నిధులు కేంద్రం మంజూరు చేస్తుందని, మిగిలిన నిధులు సంబంధిత రాష్ట్రం కేటాయించాలని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details