తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తమిళనాడులో కరోనా విజృంభణ.. లక్షకు చేరువలో కేసులు

By

Published : Jul 2, 2020, 7:09 PM IST

Updated : Jul 2, 2020, 8:12 PM IST

4343 new cases of #COVID19 reported in the state today in TN
తమిళనాడులో లక్షకు చేరువలో కేసులు.. ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా

19:56 July 02

తమిళనాడులో కరోనా విజృంభణ

ఉలుందుర్​పేట ఎమ్మెల్యే కుమారగురు

తమిళనాడులో కరోనా విజృంభిస్తోంది. కేసుల సంఖ్య లక్షకు చేరువైంది. గురువారం మరో 4,343 మందికి కరోనా పాజిటివ్​గా తేలిందని ఆ రాష్ట్ర వైద్య శాఖ ప్రకటించింది. మొత్తం కేసుల సంఖ్య 98,392కి చేరినట్లు స్పష్టం చేసింది. మరో 57 మంది వైరస్​ తీవ్రతకు మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 1,321కి చేరినట్లు వెల్లడించింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 41,047 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్య శాఖ స్పష్టం చేసింది. ఈరోజు 3,095 మంది డిశ్చార్జి కాగా.. వైరస్​ నుంచి కోలుకున్న వారి సంఖ్య 56,021కి చేరినట్లు తెలిపింది.

ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా

తమిళనాడులో గురువారం ఇద్దరు శాసన సభ్యులకు కరోనా నిర్ధరణ అయింది. రామాంతపురం జిల్లాకు చెందిన పరమకుడి నియోజకవర్గ ఎమ్మెల్యే శంతన్ ప్రభాకరన్, కల్లకురిచి జిల్లా ఉలుందుర్​పేట్​ నియోజకవర్గానికి చెందిన శాసనసభ్యుడు కుమారగురులకు కరోనా పాజిటివ్​గా తేలింది. వీరిరువురూ ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు.

ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిక

కరోనా పాజిటివ్​గా తేలిన వెంటనే పరమ​కుడి ఎమ్మెల్యే ప్రభాకరన్.. రామాంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు ఉలుందుర్​పేట్​ శాసనసభ్యుడు కుమారగురు.. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 2016 ఎన్నికల్లో ప్రముఖ నటుడు, డీఎండీకే నేత విజయ్​కాంత్​పై అన్నాడీఎంకే తరపున పోటీచేసి విజయం సాధించారు కుమారగురు. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టీలలో సభ్యుడిగా ఉన్నారు.

19:04 July 02

తమిళనాట లక్షకు చేరువలో కేసులు.. ఇద్దరు ఎమ్మెల్యేలకు వైరస్​

పరమ్​కుడి ఎమ్మెల్యే ప్రభాకరన్
  • తమిళనాడు లో కొత్తగా 4,343 మందికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ
  • ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తం గా 98,392 మంది కరోనా బాధితులు
  • కరోనా మహమ్మారికి 1,321 మంది మృతి చెందినట్టు ఆరోగ్య శాఖ వెల్లడి
  • చెన్నై మహానగరం లో 62 వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు ఈ రోజు 2,027మంది కరోనా పాజిటివ్ కేసులు
  • చెన్నై లో 62,598 మందికి కరోనా నిర్ధారణ ,రాష్ట్రం  లో ఈ రోజు కరోనా మహమ్మారికి 57 మంది మృతి
  • రామంతపురం జిల్లాకు చెందిన పరమ్​కుడి ఎమ్మెల్యే సాథన్ ప్రభాకరన్,  కల్లకూరిచి జిల్లాకు చెందిన ఉలుందుర్​పేట నియోజకవర్గం ఎమ్మెల్యే కుమారగురు కొవిడ్​ బారిన పడ్డారు.
Last Updated : Jul 2, 2020, 8:12 PM IST

ABOUT THE AUTHOR

...view details