దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. వైరస్ కారణంగా 24 గంటల్లో 43 మంది మరణించారు. కొత్తగా 991 కేసులు నమోదయ్యాయి. ఈ వివరాలను కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
24 గంటల్లో 43 మరణాలు- 991 కేసులు - కరోనా వైరస్ ఇండియా
భారతీయులను కరోనా వైరస్ కలవరపెడుతోంది. 24 గంటల వ్యవధిలో 991 కేసులు నమోదుకాగా.. 43మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 14వేల 378కి చేరింది. ఇప్పటివరకు 480మంది మరణించారు.
![24 గంటల్లో 43 మరణాలు- 991 కేసులు 43-dead-991-new-cases-recorded-in-india-in-the-last-24-hours](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6837700-thumbnail-3x2-cvc.jpg)
24 గంటల్లో 43 మరణాలు- 991 కేసులు
వైరస్కు కేంద్రబిందువైన మహారాష్ట్రలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. మధ్యప్రదేశ్లోనూ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది.
తొలి కేసు నుంచి.. ఇప్పటి వరకు
ఇదీ చూడండి:-లక్ష్మణరేఖ దాటకుండా కరోనాను జయిద్దాం
Last Updated : Apr 18, 2020, 1:12 PM IST