తెలంగాణ

telangana

ఉల్లి బస్తాల చోరీ- నిందితుల అరెస్ట్​

By

Published : Oct 27, 2020, 12:11 PM IST

మహారాష్ట్రలోని పుణెలో రూ.2.35 లక్షల విలువైన ఉల్లిపాయలు చోరీ చేశారు నలుగురు వ్యక్తులు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Onion theft in Pune
పుణెలో ఉల్లిపాయల చోరీ

దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉల్లి ధరలు ఆకాశానంటిన వేళ.. మహారాష్ట్రలో ఓ రైతుకు చెందిన ఉల్లి బస్తాలను చోరీకి గురయ్యాయి. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

దొంగిలించిన ఉల్లి బస్తాలను దాచిన నిందుతులు

రూ.2.35 లక్షల విలువైన 58 బస్తాల ఉల్లిపాయలను అపహరించారని పుణె గ్రామీణ పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి రూ.2 లక్షల విలువ 49 బస్తాలు స్వాధీనం చేసుకున్నామని మిగిలిన ఉల్లిపాయలను అమ్మేశారని పోలీసులు తెలిపారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా వారి ఆచూకీ కనుగొన్నట్లు వివరించారు.

నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న ఉల్లి బస్తాలు

ఇదీ చూడండి:లైవ్​ వీడియో: అమాంతం జనంపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్​

ABOUT THE AUTHOR

...view details