ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాలకు సంబంధించి వాట్సాప్లో అభ్యంతకర పోస్ట్లు పంపిన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్లోని ఫిరోజాబాద్లో జరగ్గా.. స్థానిక భాజపా నాయకుడు సత్యేంద్ర గుప్తా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నలుగురు నిందితులపై కేసు నమోదు చేసినట్లు నగర పోలీస్ సూపరింటెండెంట్ ముఖేశ్ చంద్ర మిశ్రా తెలిపారు.
మోదీ, షాపై అభ్యంతరకర పోస్ట్లు.. నలుగురు అరెస్ట్ - Information Technology act in Firozabad
ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలపై వాట్సాప్లో అభ్యంతరకర పోస్ట్లు పంపిన నలుగురిని ఉత్తర్ప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
![మోదీ, షాపై అభ్యంతరకర పోస్ట్లు.. నలుగురు అరెస్ట్ 4 booked for objectionable Whatsapp post on PM, HM](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7745648-thumbnail-3x2-whatsapp.jpg)
మోదీ, షాపై అభ్యంతరకర పోస్ట్లు.. నలుగురు అరెస్ట్
పట్టుబడ్డ నలుగురు నిందితులు.. యూపీ- హజ్రత్గంజ్లోని ఆర్డినెన్స్ ఎక్విప్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నట్లు ఓ అధికారి చెప్పారు. ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆ పోస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా ఫార్వర్డ్ అయ్యింది అనే విషయాలపై ఆరా తీస్తున్నారు.