తెలంగాణ

telangana

భారత్​లో పిల్లలపై రోజుకు 350 అకృత్యాలు..!

పిల్లలే లక్ష్యంగా భారత్​లో నేరాలు పెరుగుతున్నాయని వెల్లడించింది చైల్డ్​ రైట్స్ అండ్ యూ అనే స్వచ్ఛంద సంస్థ. ఇటీవల విడుదలైన 2017 జాతీయ నేర రికార్డుల బ్యూరో నివేదిక ప్రకారం.. పిల్లలే లక్ష్యంగా రోజుకు దేశంలో 350 నేరాలు సంభవించాయని స్పష్టం చేసింది.

By

Published : Oct 26, 2019, 4:51 PM IST

Published : Oct 26, 2019, 4:51 PM IST

CHILDREN-CRIMES

భారత్​లో పిల్లలపై నేరాలు పెరుగుతున్నాయని వెల్లడించింది చైల్డ్​ రైట్స్ అండ్ యూ అనే స్వచ్ఛంద సంస్థ. ఇటీవల విడుదలైన నేషనల్ క్రైమ్ రికార్డ్స్​ బ్యూరో సమాచారం ప్రకారం 2016-17 సంవత్సరంలో పిల్లలపై రోజుకు 350 నేరాలు జరిగాయని పేర్కొంది. 2017లో బాలలపై నేరాలు 20 శాతం పెరిగాయని వెల్లడించింది. అదే సమయంలో భారత్​లో నేరాల సంఖ్య 3.6 శాతం ఎక్కువగా నమోదైందని స్పష్టం చేసింది.

2007లో 1.8 శాతంగా ఉన్న నేరాల సంఖ్య.. 2017లో 28.9 శాతానికి పెరిగిందని నివేదిక పేర్కొంది. రెండేళ్ల విరామం అనంతరం ఎన్​సీఆర్​బీ నివేదిక విడుదల చేసింది. 2016లో పిల్లలపై 1,06, 958 నేరాలు... 2017లో 1, 29,032 నమోదయ్యాయి.

"2017లో సుమారు 1.3 లక్షల కేసులు నమోదు కావడం.. ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రోజూ 350 నేరాలు పిల్లలే లక్ష్యంగా జరిగాయి."

-నివేదిక

ఆ రెండూ అధికం..

బాలలపై నేరాల్లో ఉత్తర్ ​ప్రదేశ్​, మధ్యప్రదేశ్​ రాష్ట్రాలు మొదటి రెండు స్థానాల్లో ఉన్నట్లు నివేదిక స్పష్టం చేసింది. 2017లో రెండు రాష్ట్రాల్లోనూ 14.8 శాతం లేదా 19వేలకు పైగా కేసులు నమోదయ్యాయని పేర్కొంది. అంతకు క్రితంతో పోలిస్తే ఝార్ఖండ్​లో 73.9 శాతం అధికంగా నేరాలు నమోదయ్యాయి.

బాలల అపహరణల్లో మహారాష్ట్ర ప్రథమ స్థానంలో ఉండగా.. ఆ జాబితాలో బిహార్ తొలిసారి ఐదోస్థానంలో నిలిచింది.

ఇదీ చూడండి: మహిళా సాధికారతకై బిహార్ వనితల 'సైకిల్ యాత్ర..!'

ABOUT THE AUTHOR

...view details