తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జోర్దార్​గా పతంగుల పండుగ- విదేశీయులు ఫిదా - అహ్మదాబాద్​లో 31వ అంతర్జాతీయ గాలిపటాల పండుగ-2020

గుజరాత్​లో అంతర్జాతీయ గాలిపటాల పండుగ-2020 అట్టహాసంగా ప్రారంభమైంది. 43 దేశాల నుంచి విచ్చేసిన అతిథులను భారతీయ ఆటపాటలు ఆకట్టుకుంటున్నాయి. రంగు రంగుల గాలిపటాలు ఆకాశవిహారం చేస్తూ వీక్షకులను కట్టిపడేస్తున్నాయి.

31st International Kite Festival inAhmedabad
జోర్దార్​గా పతంగుల పండుగ- విదేశీయులు ఫిదా

By

Published : Jan 7, 2020, 2:38 PM IST

Updated : Jan 7, 2020, 6:29 PM IST

జోర్దార్​గా పతంగుల పండుగ- విదేశీయులు ఫిదా

గుజరాత్​ అహ్మదాబాద్​లో 31వ అంతర్జాతీయ గాలిపటాల పండుగ-2020 ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రంగు రంగుల అలంకరణలతో విదేశీ అతిథులు మైమరచిపోయేలా ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం.

వల్లభాస్థాన్​, రివర్​ ఫ్రంట్​ గ్రౌండ్​లో ఏర్పాటు చేసిన ఈ వేడుకలను ఆ రాష్ట్ర​ గవర్నర్​ ఆచార్య దేవవ్రత్‌ ప్రారంభించారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్​ రూపానీ, ఉప ముఖ్యమంత్రి నితిన్​ పటేల్​, పర్యటక శాఖ మంత్రి జవహార్​ చావ్డా సహా పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ పతంగుల పోటీల్లో మొత్తం 43 దేశాలు పాల్గొంటున్నాయి. మన దేశం నుంచి 12 రాష్ట్రాలకు చెందిన 153 రకాల గాలిపటాలు వీక్షకులకు కనువిందు చేస్తున్నాయి.

వివిధ దేశాల నుంచి ఈ పండులో పాల్గొనేందుకు విచ్చేసిన అతిథులను అలరించేందుకు భారతీయ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. భారతీయ నృత్యాలు, ఉత్తరాయణం పండుగ విశేషాలు తెలుపుతూ నాటకాలు, పాటలు, ఒక్కటేమిటి ఎటు చూసినా కోలహలమే. ఈ ప్రాంగణంలో 20కి పైగా ఫుడ్ స్టాల్స్, సుమారు 50 క్రాఫ్ట్ స్టాల్స్ ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి: కరడుగట్టిన రేపిస్ట్​కు జీవితఖైదు- బాధితులంతా అబ్బాయిలే!

Last Updated : Jan 7, 2020, 6:29 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details