భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉగ్రకుట్రలను భగ్నం చేశాయి సరిహద్దు భద్రత బలగాలు(బీఎస్ఎఫ్). భారీ స్థాయిలో అక్రమ ఆయుధాల తరలింపును బీఎస్ఎఫ్ అధికారులు అడ్డుకున్నారు. మిజోరాం మమిత్ జిల్లాలో వాటిని స్వాధీనం చేసుకున్నారు.
సరిహద్దుల్లో తనిఖీలు నిర్వహించిన బీఎస్ఎఫ్ బలగాలు.. అక్రమంగా ఆయుధాలు రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రెండు వాహానాలు, భారీ సంఖ్యలో ఆయుధ సామగ్రి సహా రూ. 39,020 నగదు స్వాధీనం చేసుకున్నారు.